మనీ: బిజినెస్ చేయాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ ఇదే..!
కరోనా వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వర్క్ ఫ్రం హోం పేరిట ఇంటి నుంచి ఉద్యోగం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ల్యాప్ టాప్ లు, మొబైల్ ల ట్రెండు పెరిగిపోవడంతో వాటిని రిపేర్ చేసే వారికి కూడా డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యంగా ఈ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు మీరు వాటి గురించి మొత్తం సమాచారాన్ని తెలుసుకొని ఉండాలి. అంటే ముందుగా మీరు ల్యాప్ టాప్ మరియు మొబైల్ రిపేరింగ్ చేయడంలో కోర్స్ పూర్తి చేయాలి. దేశంలోని అనేక ఇన్స్టిట్యూట్ లు ఈ కోర్స్ ఆఫర్ చేస్తున్నాయి.
అంతేకాదు ల్యాప్ టాప్, మొబైల్ రిపేరింగ్ ఆన్లైన్లో నేర్చుకునే అవకాశం కూడా ఉంది. ఇన్స్టిట్యూట్ కి వెళ్తేనే మీకు ప్రాక్టికల్ గా మరింత నాలెడ్జ్ లభిస్తుంది. కోర్సు పూర్తి చేసిన తర్వాత రిపేరింగ్ సెంటర్లో కొంత సమయం పని చేస్తే మీకు పూర్తి నాలెడ్జ్ లభిస్తుంది తర్వాత సొంతంగా వ్యాపారాన్ని మొదలు పెట్టవచ్చు. ముఖ్యంగా ల్యాప్ టాప్ మరియు మొబైల్ రిపేరింగ్ కేంద్రాన్ని ప్రారంభించడానికి ముందుగా అవసరమైన పరికరాలు మీ దగ్గర ఉంచుకోవాలి. ముందుగా ఒక జాబితా తయారు చేసుకుని కొనుగోలు చేస్తే డబ్బు కూడా వృధా అవ్వకుండా ఉంటుంది . రిపేరు చేసే సమయంలో మార్చాల్సిన పరికరాలను ఉదాహరణకు స్క్రీన్, స్పీకర్లు వంటి వాటిని ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి కూడా తెప్పించుకోవచ్చు.