మనీ: ఆడపిల్లల తల్లిదండ్రులకు శుభవార్త.. అయితే ఈ పథకం లో మీరు ఉన్నారా..?
ఇప్పటికే ఆడపిల్లల తల్లిదండ్రులు సుకన్య సమృద్ధి యోజన పథకంలో చేరి ఉన్నట్లయితే వారికి శుభవార్త తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. మీడియా నివేదికల ప్రకారం నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్ , సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్, సుకన్య సమృద్ధి యోజన పథకం తో పాటు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకాలపై వడ్డీ రేట్లను మార్చాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ పథకాల పెట్టుబడిదారులకు ప్రయోజనం కూడా బాగా చేకూరనుంది.ఇకపోతే ఈ ఏడాది జూన్లో చిన్న పథకాల వడ్డీ రేట్లకు సంబంధించి కూడా ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం.
ఇక పెంచిన తర్వాత వడ్డీ రేట్లు జూలై నుంచి సెప్టెంబర్ వరకు వర్తించనున్నాయి. ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ లో పొదుపు చేసిన పథకాలపై ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. ఇక ఈ పథకాలు దేశంలోని ప్రైవేట్ అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకుల కంటే ఎక్కువగా ఇస్తూ ఉండడం గమనార్హం. చాలాకాలం వరకు ఈ చిన్న పొదుపు పథకాల మీద ప్రభుత్వం ఎలాంటి వడ్డీరేట్లను పెంచలేదు. త్వరలోనే ఈ పథకాలపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. త్వరలోనే చిన్న పొదుపు పథకాలపై ఎంత వడ్డీ రేట్లు పెంచారు అనే విషయం కూడా తేలనుంది.