మనీ: వ్యాపారం చేసే వారికి శుభవార్త.. రూ.10 లక్షల - రూ. కోటి వరకు లోన్..!!

Divya
ప్రస్తుత కాలంలో చాలా మందికి ఉద్యోగం చేయడం అనే విషయం పెద్దగా నచ్చడం లేదు . అందుకే సొంతంగా వ్యాపారాలు చేయాలని నిర్ణయం తీసుకుంటున్నారు. ఇకపోతే ఎవరైతే వ్యాపారం చేయాలని అనుకుంటున్నారో.. వారికి రుణాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకు రావడం గమనార్హం. అయితే వాటి గురించి సరైన అవగాహన లేక వ్యాపారులు కూడా ఎన్నో ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. ప్రస్తుతం ఒక స్కీమ్ ద్వారా వ్యాపారం చేయాలని ఆలోచించే వారికి ఏకంగా కోటి రూపాయల వరకు రుణం అందించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది..

షెడ్యూల్డ్ కులాలు , షెడ్యూల్డ్ తెగల వారితోపాటు మహిళలకు కూడా రుణాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్టాండప్ ఇండియా పథకం ఇటీవల ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2016లో ప్రారంభించిన ఈ పథకం ద్వారా ఎంతో మంది రుణాలను పొందారు. ఇక ఈ ఏడాది మార్చి 21 వరకు సుమారుగా ఒక 1,33,995 మంది ఈ పథకం నుంచి రుణాలు తీసుకున్నారు అని.. ఏకంగా రూ.30,160 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఈ పథకం ద్వారా వ్యాపారం చేయాలని ఆలోచించే వారిలో ఎస్సీ, ఎస్టీ కులాల తో పాటు మహిళలకు కూడా రుణాలను అందివ్వడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని పనులు సమకూర్చింది . ఇకపోతే ఈ పథకాల ద్వారా రూ. 10 లక్షల నుండి కోటి రూపాయల వరకు రుణం పొందడానికి అర్హులు అవుతారు.. 18 సంవత్సరాలు నిండిన ఎవరైనా సరే ఈ పథకం ద్వారా డబ్బులను రుణంగా పొందవచ్చు. ప్రతి బ్యాంకు లో కూడా కనీసం ఒక్కరికైనా ఈ పథకం ద్వారా లోన్ ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే తయారీ రంగంz వ్యవసాయ అనుబంధ వ్యాపార ,  సేవా రంగాలలో పనిచేసే వారు ఈ రుణాలను పొందవచ్చు. బ్యాంకుల ద్వారా గతంలో రుణం తీసుకొని చెల్లించకుండా డిఫాల్ట్ అయిన వారికి ఈ పథకం ద్వారా రుణం లభించదు. ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాండప్ ఇండియా పోర్టల్ అయినటువంటి https://www.standupmitra.in/ ద్వారా రుణానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: