మనీ: 21 యేళ్ళ పైబడిన మహిళలకు శుభవార్త..!!

Divya
ముఖ్యంగా 21 యేళ్ళ వయసు పైబడిన వారికి ఒక శుభవార్త అని చెప్పవచ్చు. అయితే రెండు లక్షల రూపాయల వరకు రుణం పొందే వీలు ఉంటుంది అది కూడా వడ్డీ రేటు 20 శాతంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు మాత్రమే రుణాలు అందించే సంస్థ ఒకటి ప్రస్తుతం అందుబాటులోకి రావడం జరిగింది . దాని పేరే మహిళామనీ.. దీని ద్వారా ఇంట్లో నుంచి అర్హత కలిగిన మహిళలు సులభంగా ఋణం పొందవచ్చు . మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఆన్లైన్ ద్వారానే ప్రాసెస్ మొత్తం అయిపోతుంది. మహిళా మనీ అనే ఒక సంస్థ కేవలం ఆడవారి కోసం మాత్రమే ప్రత్యేకంగా రుణాలను అందిస్తోంది.
ఇందులో 21 సంవత్సరాలు దాటిన వారు అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా భారతీయ పౌరులు అయి ఉండి తీరాల్సిందే. సుమారుగా  రూ. రెండు లక్షల వరకు తీసుకోవచ్చు. ఇకపోతే వడ్డీ రేటు మాత్రం 20 శాతంగా ఉంటుంది. తీసుకున్న రుణాన్ని ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల లోపు కాలపరిమితితో రుణం తీర్చే వేయాలి. తీసుకున్న రుణాన్ని ప్రతినెల ఈఎంఐ రూపంలో చెల్లిస్తే సరిపోతుంది. మహిళలకు రుణాలు అందించడానికి బ్యాంకులు..  నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ వంటి వాటితో ఒప్పందం కుదుర్చుకొని వీటి సహకారంతోనే ఆడవారికి పర్సనల్ లోన్స్ అందివ్వడం జరుగుతుంది. ఇందుకోసం కో గ్యారెంటర్ అవసరం లేదు.
ఎలా అప్లై చేసుకోవాలి అంటే.. మహిళామనీ అనే వెబ్ సైట్ లోకి వెళ్లి అక్కడ ఎమ్ ఎమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు క్లిక్ చేసి ఆ తర్వాత అప్లై లోన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని పై క్లిక్ చేసి మీ రుణం కోసం అప్లై చేయవచ్చు . ఇక పూర్తి వివరాలు అందించిన తర్వాత మహిళామనీ టీం సభ్యులు మీకు ఫోన్ చేస్తారు. కానీ వడ్డీ భారం ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. అయితే అత్యవసర పరిస్థితులలో ఈ డబ్బులు చాలా అవసరం పడుతుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: