మనీ : పోస్టల్ ఖాతాదారులకు శుభవార్త తెలిపిన పోస్టల్ శాఖ..!!

Divya
ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ లో ఖాతా కలిగినవారికి పోస్టల్ శాఖ శుభవార్తను తెలిపింది. ముఖ్యంగా దూరప్రయాణం , వ్యయప్రయాసలు లేకుండా.. ఈఎంఐ పేమెంట్స్, ఓటీటీ సబ్స్క్రిప్షన్ , మొబైల్ బిల్లులు ఇలా ప్రతి ఒక్క రికరింగ్ పేమెంట్ చేయాలనుకున్న కస్టమర్లకు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ , ఎన్ పీసీఐ భారత్ బిల్ పే శుభవార్త అందించింది. ముఖ్యంగా ఈ భారత్ బిల్ పే ప్లాట్ఫామ్ ద్వారా.. ఎవరైతే యూజర్లు ఉన్నారో వారు ఇంటి దగ్గర నుంచి క్యాష్ బేస్డ్ అసిస్టెడ్ బిల్లు చెల్లింపు సదుపాయం కల్పిస్తున్నట్లు తాజాగా ఐపీపీబీ అలాగే ఎన్ పీసీబీ కలసి ఒక సంయుక్త ప్రకటన చేశాయి.
ముఖ్యంగా భారతదేశం అంతటా గ్రామీణ డాక్ సేవక్స్, పోస్టల్ సిబ్బంది సహాయంతో ఈ సేవలు ఉపయోగించుకోవచ్చని ippb వెల్లడించింది. ఎవరైతే నాన్ ippb కస్టమర్ లు ఉన్నారో వారు వివిధ యుటిలిటీ ఇతర సేవల కోసం బిల్లులను చెల్లించడానికి ఈ ప్లాట్ ఫామ్ అందరికీ వీలు కల్పించిందని ippb స్పష్టం చేసింది. సాధారణంగా మనం ఏదైనా బిల్ పేమెంట్ చేయాలి అంటే సంబంధిత సంస్థలకు వెళ్లి  చెల్లించాల్సి ఉంటుంది . ఇక పట్టణ ప్రాంతాల్లో ఉండే వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి వారు సులభంగా బిల్లు చెల్లిస్తూ ఉంటారు.
మారుమూల గ్రామాల్లో నివసించే కస్టమర్లకు ఇలాంటి సదుపాయం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. లక్షలాది మంది కస్టమర్లకు మెరుగైన సేవలను అందించడానికి పోస్టల్ శాఖ బిల్లు చెల్లింపు ప్లాట్ఫామ్ను మెరుగుపరిచినట్లు స్పష్టం చేసింది. తాజాగా భారత్ బిల్ పేమెంట్ ఫ్లాట్ ఫామ్ లో ఉన్న 20 వేల బిల్లర్లు..వివిధ బ్యాంకులు కూడా ippb వినియోగదారులకు అందుబాటులో ఉంటారని స్పష్టం చేసింది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న పేటీఎం గూగుల్ పే ఫోన్ పే లాగి భారత్ బిల్ పేమెంట్ ప్లాట్ఫాం కూడా పనిచేస్తుంది అని స్పష్టం చేసింది ఇక ఎలాంటి రికార్డింగ్ ద్వారా మనం ఇంట్లో కూర్చుని చెల్లించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: