మనీ: రూల్స్ మార్చిన కేంద్ర ప్రభుత్వం..!
సరికొత్తగా పీఎఫ్ ఆర్డీఏ మార్చిన రూల్స్ ప్రకారం..ప్రభుత్వ ఉద్యోగులు సెక్షన్ 80సీసీడీ(1బీ) కింద సూచించిన రూల్స్ ప్రకారం నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద అదనంగా రూ.50 వేల వరకు మినహాయింపు పొందవచ్చు. ఎన్పీఎస్ ఖాతాలో జమ చేసిన డబ్బును కాలపరిమితి కంటే ముందే 25 శాతం వరకు పొందవచ్చు. రిటైర్మెంట్ తర్వాత ఎన్పీఎస్లో జమయ్యే డబ్బులో దాదాపు 60 శాతం వరకు పన్ను మినహాయింపు కూడా వర్తిస్తుంది. కానీ కేవలం మరో 40 శాతం యాన్యుటీ కొనుగోలుకు మాత్రమే పన్ని వెచ్చించాలి.
ఇక నిర్ణీత గడువు కంటే ముందే ఎవరైనా ఎన్పీఎస్ నుంచి బయటకు రావాలనుకుంటే.. ఇప్పటి వరకూ ఉన్న రూ.లక్ష పరిమితి వుండేది..కానీ ఇప్పుడు అది రూ.2.5 లక్షలకు పెంచడం జరిగింది.ఇక ఎన్పీఎస్లో చేరాలని అనుకునే వారు ఇప్పటివరకూ 65 యేళ్లు ఉండగా.. ఇప్పుడు దీన్ని 70 సంవత్సరాలకు పెంచారు. ఇక 65 సంవత్సరాల తరువాత ఎన్ పీ ఎస్ లో చేరితే మరో మూడు సంవత్సరాల పాటు కొనసాగించాలి. ఇకపోతే గతంలో ఎం పి ఎస్ నుంచి పెట్టుబడి పెట్టిన మొత్తం వెనక్కి తీసుకునే అవకాశం లేదు.
ఇప్పుడు తాజాగా మార్చిన రూల్స్ నిబంధనలతో రూ.5 లక్షల లోపు ఎవరైనా సరే ఎన్పీఎస్ నిధి ఉన్నవారు పదవీ విరమణ చేసిన తర్వాత కూడా..ఎన్పీఎస్ నుంచి బయటకు రావాలని అనుకున్నా.. ఆ మొత్తం సొమ్మును వెనక్కి తీసుకునే వెసులుబాటును కూడా కేంద్రం కల్పించింది.