మనీ: ఇలా చేస్తే నెలకు రూ.40 వేలు ఆదాయం..

Divya

కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్న తరుణంలో చాలా మంది ఆర్థికంగా నష్టపోయిన విషయం తెలిసిందే. ఇక అందులో భాగంగానే ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేసి, డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారు. మరి కొంతమందేమో ఏదైనా వ్యాపారం చేస్తే బాగుండు అని సకల ప్రయత్నాలు చేయడంతో పాటు, తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ లాభాలు వచ్చే వ్యాపారాలను కూడా చేయడానికి పూనుకుంటున్నారు. ఇప్పుడు కూడా సరికొత్త బిజినెస్ అందుబాటులోకి వచ్చింది. అయితే దీనిని కొత్త బిజినెస్ అని చెప్పలేము కానీ చిన్న తరహా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు.

ఇందులో తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో నెలకు దాదాపు నలభై వేల వరకూ ఆదాయాన్ని పొందవచ్చు. అదేదో కాదు ఐ ఆర్ సీ టీ సీ. ఏజెంట్ గా పనిచేయడం. ఇందులో పనిచేయడం వల్ల తక్కువ సమయంలోనే ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు. ఐ ఆర్ సీ టీ సీలో ఏజెంట్ గా పని చేయడంవల్ల , సుమారుగా నెలకు 30 వేల రూపాయల నుంచి 40 వేల రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు. అంటే ఇందులో ట్రైన్ టికెట్స్ బుక్ చేయడం ద్వారా ఇలాంటి ఆదాయాన్ని పొందవచ్చు.

అయితే ఇందులో కమీషన్ రూపంలో డబ్బులు పొందవచ్చు. కాబట్టి ఎంత చేసుకుంటే అంత డబ్బు వస్తుంది అని మాత్రం చెప్పవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, ట్రైన్ ట్రావెల్ ఏజెంట్ గా పనిచేయడానికి అందరూ అర్హులు కాదు. కనీసం ఇంటర్మీడియట్ అయినా తప్పకుండా ఉత్తీర్ణులై ఉండాలి. అలాంటి వారు ఈ ట్రైన్ ట్రావెల్ ఏజెంట్ గా పని చేయడానికి అర్హులు. ఐ ఆర్ సి టి సి లో ఏజెంట్ గా చేయాలనుకునే వాళ్ళు ముందుగా దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు ఆధార్ కార్డు ,  పాన్ కార్డు తప్పనిసరి. అంతేకాదు 20 వేల రూపాయలతో అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ నిర్ణీత గడువు పూర్తయిన వెంటనే మీ డబ్బులు మీకు వెనక్కి ఇస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: