"మా" బిల్డింగ్ హామీకీ స్వస్తి పలికిన విష్ణు...!!

murali krishna
మా అసోసియేషన్ లో సొంత బిల్డింగ్ గురించి చర్చలు బాగా జరుగుతున్నాయి. గత ఎన్నికలలో మంచు విష్ణు అధ్యక్షుడిగా అయితే ఎన్నికయ్యాడు.
అయితే ఇంతవరకు సొంత బిల్డింగ్ కి పునాది రాయి కూడా పడలేదు. ఓ సందర్భంలో తాను నిర్మించడానికి రెడీగా ఉన్నా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయని మంచు విష్ణు తెలిపారటా.. ఆ తర్వాత మా నుంచి కానీ అధ్యక్షుడి నుంచి కానీ ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. ఇంకా విష్ణు పదవి కాలం ఒక ఏడాది మాత్రమే ఉందటా.ఈలోపు బిల్లింగ్ పూర్తి అవుతుందన్న నమ్మకం కూడా లేదు. ఈ విషయంలో మాలో ఏం జరుగుతుందో అర్థం కానీ సన్నివేశం కనిపిస్తుందని తెలుస్తుంది.
ఇప్పుడు మా సభ్యుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.కొంతమంది మా బిల్డింగ్ కట్టాలని అంటుంటే మరికొంతమంది బిల్డింగ్ అవసరం లేదని , ఆ డబ్బుతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని కూడా అంటున్నారు. బిల్డింగ్ నిర్మాణానికి కనీసం 40 కోట్లు అయినా ఖర్చు అవుతుంది. 700 మంది సభ్యులు ఉన్న మా కు 20 మంది ప్యానల్ లో ఉన్నారటా.. మా మీటింగ్ జరిగితే అందరూ హాజరు అయ్యే పరిస్థితి కూడా ఉండదు. అధ్యక్షుడు, అతడి టీంకి రోజు ఆఫీస్ కి వచ్చే పని కూడా ఉండదు. కేవలం ఈసీ మీటింగ్ సమావేశాల్లో తప్ప మా బిల్డింగ్ వలన ఉపయోగాలు ఏంటి అన్న వాదన  కూడా వినిపిస్తోంది.
20 మంది కోసం 40 కోట్ల రూపాయలతో బిల్డింగ్ అవసరమా, ఆ డబ్బులు పేదవారి కోసం ఖర్చు చేస్తే బాగుంటుంది కదా అని మెజారిటీ వర్గం అయితే భావిస్తున్నారట. అలాగే ఇప్పుడున్న ఫిల్మ్ ఛాంబర్ ప్లేస్ లో కొత్త బిల్డింగ్ నిర్మించే ఆలోచనలో కూడా ఉన్నారట. దానికి 40 కోట్లు ఎందుకని అయితే అంటున్నారట. ఈ క్రమంలోనే సొంత బిల్డింగ్ కి సంబంధించిన నిర్ణయం అధ్యక్షులు తీసుకోలేకపోతున్నారని సమాచారం.అయితే మాకీ సొంత బిల్లింగ్ కల ఎప్పటికీ నెరవేరేటట్లు లేదని ఎప్పటినుంచో సొంత బిల్డింగ్ కట్టుకోవాలని పెద్దలు కూడా భావిస్తున్నారు. రాఘవేంద్రరావు, చిరంజీవి, మురళీమోహన్ లాంటివాళ్ళు ఎప్పటినుంచో అంటున్నారటా.. కానీ తాజా కమిటీ ఇప్పుడు ఆ ఆలోచన పూర్తిగా మార్చేసినట్లు అయితే తెలుస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: