వర్మ ఆ హీరోయిన్ తో ఎఫైర్ నడిపారా..?
అప్పట్లో రంగీలా, క్షణం క్షణం, దయ్యం, శివ తదితర చిత్రాలను తెరకెక్కించి బాక్సాఫీస్ వద్ద షేక్ చేశారు. క్రమక్రమంగా టెక్నాలజీ మారుతూ ఉండడంతో నేటితరం ఎక్కువగా యువత బోల్డ్ కంటెంట్ల వైపు అట్రాక్ట్ కావడంతో రాంగోపాల్ వర్మ కూడా అటు సైడ్ గా వెళ్లడం జరిగింది. రెండుకు తగ్గట్టుగా సినిమాలను తెరకెక్కిస్తూ ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటారు వర్మ. గడిచిన కొన్ని నెలల నుంచి వర్మ నిజం అంటూ కొన్ని వీడియోలను పోస్ట్ చేస్తూ ఉన్నారు.
తాజాగా ఆయన పోస్ట్ చేసిన 90లో జరిగిన ఒక విషయాన్ని తెలియజేయడం జరిగింది. తనకు ఊర్మిలకు ఎఫైర్ ఉందని మొదటిసారి ఒక మ్యాగజైన్లో రాశారని తెలుసుకొని సీక్రెట్ గా అమీర్ పెట వెళ్లి అక్కడ చూడకూడనిదే చూశానని చెప్పారు రాంగోపాల్ వర్మ.. ఇప్పుడైతే తనపై అలాంటివి ఎన్నో వార్తలు వస్తున్నాయని సోషల్ మీడియా ఎఫెక్ట్తో జరుగుతున్న బిజినెస్ ఇది అని తెలిపారు వర్మ.. హాట్ బ్యూటీ అషు రెడ్డి, ఆరియానా తో బోల్డ్ ఇంటర్వ్యూ చేయడంతో మరింత వైరల్ గా మారారు. ఈమధ్య పొలిటికల్ లో కూడా బాగా యాక్టివ్ గా ఉంటున్నారు వర్మ.