రామ్ చరణ్ ఖాతాలో మరో అరుదైన గౌరవం..!?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ కెరియర్ పరంగా ఇప్పుడు వరుస సినిమాను చేస్తూ బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా బుచ్చిబాబు దర్శకత్వంలో మరో సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు రామ్ చరణ్ .ఇక ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రాంచరణ్ అభిమానులు ఈ రెండు సినిమాలు కూడా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు రామ్ చరణ్ హాజరైన సంగతి తెలిసిందే .కాగా ఈ వేడుకలు రాంచరణ్ చేసిన కామెంట్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు నేటిజన్స్. 

తాజాగా రామ్ చరణ్కు ఒక అరుదైన గౌరవం దక్కింది. జీ20 సమ్మిట్ కోసం చరణ్ కాశ్మీర్ కు వెళ్లడం జరిగింది. శ్రీనగర్కు వెళ్లిన రాంచరణ్ జమ్మూకాశ్మీర్లో సినిమా షూటింగ్లు చేయాలని ప్రమోట్ చేయనున్నారని తెలుస్తోంది దీంతో రామ్ చరణ్ కు ఈ అరుదైన అవకాశం రావడంతో ఆయన అభిమానులు సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. అంతేకాదు మరోవైపు గేమ్ చెంజర్ సినిమా ఏకంగా 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో రాబోతుంది.చరణ్ నటించబోయే సినిమాలన్నీ కూడా ఇలాగే వరుసగా బాక్స్ ఆఫీస్ లో దాచి సంచలనాలను సృష్టిస్తాయని భావిస్తున్నారు.

 దీంతో చరణ్ కథలో ఎంపిక విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. రాంచరణ్ ఇప్పుడు ఒక్కో సినిమాకు 100 కోట్లు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నారు ఫ్యాన్స్. అంతేకాదు నటుడిగా తన స్థాయిని పెంచుకోవడంతో పాటు తన అభిమానులకు కూడా మరింత దగ్గరవుతున్నాడు రామ్ చరణ్. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ రేంజ్ అంతకంతకు పెరిగిపోవడంతో ఎంతో సంతోషిస్తున్నారు మెగా ఫ్యాన్స్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: