రవితేజ కోసం రంగంలోకి దిగిన మహేష్ బాబు..!?

Anilkumar
మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నడూ లేని విధంగా మాస్ మహారాజా నటిస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా టైగర్ నాగేశ్వరరావు. ఇప్పటివరకు రవితేజ నటించిన సినిమాలకు విభిన్నంగా ఈ సినిమా ఉండబోతుంది. ఇటీవల రావణాసుర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ మహారాజా రవితేజ ఆ సినిమాతో ప్రేక్షకులను అలరించలేకపోయాడు. ప్రస్తుతం ఇప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకుల కు మరింత దగ్గర కావడానికి ట్రై చేస్తున్నాడు మాస్ మహారాజా. ఇందులో భాగంగానే టైగర్ నాగేశ్వరరావు సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 

వంశీ దర్శకత్వం వహించగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తేజ్ నారాయణ అగర్వాల్ ఈ సినిమాని సమర్పిస్తున్నారు. రవితేజ సినీ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా రాబోతోంది.ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్ర బృందం. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను వివిధ భాషల్లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఒక్కో భాషలో ఒక్కో స్టార్ హీరో ఈ సినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

టాప్ స్టార్ హీరోలు అందరితో ఈ సినిమా టీజర్ కోసం అందర్నీ బరిలోకి దింపుతున్నట్లుగా తెలుస్తుంది .తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా హిందీ టీజర్ కి ఏకంగా జాన్ అబ్రహం వాయిస్ ఓవర్ అందించడం జరిగింది. ఇక తమిళ్ ల్ ఇదే టీజర్ కి కార్తి కన్నడలో శివరాజ్ కుమార్ మలయాళం లో దుల్కర్ సల్మాన్ గాత్రాన్ని అందించారు. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా టీజర్ కు వాయిస్ ఇవ్వరున్నారు అన్న సమాచారం వినబడుతోంది .ఇప్పటికే మహేష్ బాబు పలు సినిమాలకి వాయిస్ తెచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్లో నిండిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక రవితేజ నటిస్తున్న ఈ సినిమా 1970 నాటి కథ కావడంతో ఈ సినిమాలో భాగంగా ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: