నాగార్జున మేనకోడలితో అడివి శేష్ పెళ్లి.. ఎప్పుడంటే..!?

Anilkumar
టాలీవుడ్ లో మరొక జంట పెళ్లికి రెడీ అయింది. వరుడు ఎవరో కాదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లవర్ అయిన హీరో అడవి శేషు. ప్రస్తుతం ఈయనకి సంబంధించిన పెళ్లి వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది హీరో పెళ్లి చేసుకోబోయేది మరెవరినో కాదు అక్కినేని సుప్రియను. ఇక ఆమె స్వయంగా అక్కినేని నాగార్జునకు మేనకోడలు అన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. అడవి శేష్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అని ఎప్పటినుండో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే నిజానికి జంట ఎప్పుడో పెళ్లి చేసుకోవాలి ..

కానీ అడవి శేషు ఇంట్లో వాళ్ళు సుప్రియ తో పెళ్లికి ఒప్పుకోలేదు.అందుకే  వీరి పెళ్లి ఇన్నాళ్లు వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా ఇప్పుడు అడివి తల్లిదండ్రులు ఆమెతో అతని పెళ్లికి ఓకే చెప్పారని అందుకే పెళ్లి డేట్ సైతం ఫిక్స్ చేసినట్లుగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక కొత్త వార్త వినబడుతోంది. సాధారణంగా అడివి శేష్ ఏదైనా పండగ జరిగిన ఏదైనా ఈవెంట్ జరిగిన కూడా ఖచ్చితంగా అక్కినేని ఫ్యామిలీతోనే కలిసి జరుపుకుంటున్నడు. ఇక వాటికి సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. వాటితో పాటు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సుప్రియ అడవి శేషు ఇద్దరూ

 ఒకే కారులో వచ్చి మీడియా కంట కూడా పడ్డారు. ఇలా వీరిద్దరూ ఎక్కడికి వెళ్లినా జంటగా వెళతారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అని అందరూ భావిస్తున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అక్కినేని నాగచైతన్య అడవి శేష్ మరియు సుప్రియల పెళ్లికి పెద్దగా వ్యవహరించబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు వీరిద్దరి పెళ్లి గురించి ఇటు అక్కినేని కుటుంబం అలాగే అటు అడివి శేష్ కుటుంబ సభ్యులను సైతం ఒప్పించి వారిద్దరి పెళ్లి చేయబోతున్నాడట నాగచైతన్య. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు వీరి పెళ్లి జూన్ 16న జరిగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: