'పుష్ప' లో ఛాన్స్ వచ్చి ఉంటే కచ్చితంగా ఆ పాత్ర చేసేదాన్ని : ఐశ్వర్య రాజేష్

Anilkumar
కోలీవుడ్లో అగ్ర హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగులో కూడా ఈమె పలు సినిమాల్లో నటించింది. ఈమధ్య కోలీవుడ్లో లేడీ ఓరియంటెడ్ మూవీస్ తో దుమ్ము లేపుతోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య రాజేష్.. పుష్ప సినిమాలో తనకు ఛాన్స్ వచ్చి ఉండుంటే కచ్చితంగా నటించేదాన్నని, అందులో ఓ పాత్ర తనకు చాలా బాగా సూట్ అవుతుందని చెప్పుకొచ్చింది. 'తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే నాకు చాలా ఇష్టం. తెలుగులో సినిమా చేస్తే కచ్చితంగా అది నా ఫ్యామిలీ గర్వపడే మూవీ అయి ఉండాలని అనుకున్నా. 

అలా తెలుగులో ఎన్నో ఏళ్లు అవకాశం కోసం ఎదురు చూశాక వరల్డ్ ఫేమస్ లవర్ లో నటించే ఛాన్స్ వచ్చింది. ఆ మూవీ నన్ను తెలుగు వారికి మరింత చేరువ చేసింది. దాని తర్వాత టక్ జగదీష్, రిపబ్లిక్ సినిమాల్లో చేశా. ఇప్పుడు కూడా తెలుగులో ఆఫర్లు రావడం లేదని కాదు. వస్తున్నాయి. కాకపోతే మంచి పాత్రలతో కం బ్యాక్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ప్రెజెంట్ తెలుగులో అయితే ఏ ప్రాజెక్ట్ చేయడం లేదు. ఒకవేళ పుష్ప మూవీలో నాకు చాన్స్ వచ్చి ఉంటే ఖచ్చితంగా చేసేదాన్ని. పుష్ప లో రష్మిక మందన చాలా బాగా నటించారు. అందులో డౌటే లేదు.కాకపోతే ఆ రోల్ నాకు బాగా సూట్ అవుతుందని నా నమ్మకం. అలాగే డ్రీమ్ రోల్ అంటూ నాకు ఏదీ లేదు.

ప్రేక్షకులను అలరించే విధంగా మంచి మంచి పాత్రలు చేయాలని ఉంది. పాత్ర ఏదైనా సరే దుమ్ము దులిపేయడమే' అంటూ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇక ఆ తర్వాత తెలుగు ఆడియన్స్ గురించి మాట్లాడుతూ..' చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా తెలుగు ప్రేక్షకులు దాన్ని ఆదరించే తీరు చాలా ప్రత్యేకంగా గా ఉంటుంది. సినిమా బాగుందని చెబితే చాలు దాన్ని ఏకంగా బ్లాక్ బస్టర్ చేసేస్తారు. ఇలాంటి ప్రేక్షకుల ప్రేమను నేను ఏ ఇండస్ట్రీలో చూడలేదు. నేను నటించిన 'డ్రైవర్ జమున' సినిమాని ఆహా వేదికగా డబ్ చేసి రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. చేసింది నాలుగు సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకుల ప్రేమను ఎంతో బాగా పొందుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది' అంటూ తెలిపింది ఐశ్వర్య రాజేష్...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: