అరుదైన రికార్డు క్రియేట్ చేసిన ప్రభాస్...!!

murali krishna
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్  ప్రధాన పాత్ర లో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో భారీ విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం ''ఆదిపురుష్''
ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సాధారణ ఆడియెన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరో నెల రోజుల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా గురించి అప్పుడే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసారని తెలుస్తుంది.
ఈ క్రమంలోనే అదిరిపోయే రేంజ్ లో ట్రైలర్ ను కూడా విడుదల చేసారు.. ఈ ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను బాగా అలరించింది.. ట్రైలర్ కట్ ఎలా ఉంటుందో అని అనుకున్న ఫ్యాన్స్ కు ఓం రౌత్ 'జై శ్రీరామ్' అనే నినాదం ఫ్యాన్స్ చేసే లా  అయితే చేసాడు.. ఇప్పటి వరకు సినిమా మీద ఉన్న నెగిటివ్ ఇంప్రెషన్ పోయేలా చేసి పాజిటివ్ గా అయితే మార్చేశాడు.
మొత్తానికి ప్రేక్షకుల ను జూన్ 16 ఎప్పుడెప్పుడు వస్తుందా ఈ సినిమా ఎప్పుడు చూస్తామా అని ఎదురు చూసేలా చేయడం లో మేకర్స్ సక్సెస్ అయ్యారని చెప్పాలి .మరి తాజా గా ప్రభాస్ ఈ సినిమా విషయం లో ఒక అరుదైన రికార్డ్ ను అందుకున్నాడు.. ఆదిపురుష్ ట్రైలర్ అన్ని భాషల్లో కలిపి ఏకంగా 100 మిలియన్ వ్యూస్ మార్క్ ను అయితే చేరుకుంది..
ప్రభాస్ నటించిన వరుస నాలుగు సినిమాల కు 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన ట్రైలర్స్ ఉన్న హీరో ప్రభాస్ అని కూడా తెలుస్తుంది.. బాహుబలి తర్వాత భారీ హైప్ ను తెచ్చుకుంటున్న ఈయన సినిమా ట్రైలర్స్ ప్రతీసారి కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి..ఈ రేర్ రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్న ఏకైక హీరో పాన్ ఇండియా స్టార్  కూడా ప్రభాస్ అని సమాచారం.ఈ వార్త విని ప్రభాస్ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: