ఆ రూమర్ల వల్ల పదవి కోల్పోయా.. ఝాన్సీ..!!

Divya
సాధారణంగా ఏ ఇండస్ట్రీలో నైనా సరే సినీ సెలెబ్రెటీలకు సంబంధించి తరచూ ఏదో ఒక విషయం వైరల్ గా మారుతూనే ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే తరచుగా ఏదో ఒకటి వినిపిస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో ఎక్కువగా హీరో హీరోయిన్స్ మధ్య ఎఫైర్ గురించి ,పెళ్లి వార్తల గురించి, విడాకుల గురించి పలు రకాల రూమర్లు వినిపిస్తూనే ఉంటాయి. కొంతమంది సెలబ్రిటీలు మాత్రం ఇలాంటి విషయాలను అసలు పట్టించుకోరు.. మరి కొంతమంది అలాంటి వాటికి సమాధానంగా దీటుగా స్పందిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో వినిపించేటువంటి ఇలాంటి రూమర్స్ వల్ల కొంతమంది సెలబ్రిటీల జీవితం పలు రకాలుగా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తూ ఉంటుంది.

తాజాగా ఇదే విషయం గురించి మాట్లాడుతూ అలనాటి యాంకర్ ఝాన్సీ పలు కామెంట్లు చేయడం జరిగింది. ఒక మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ తన జీవితం లో జరిగిన కొన్ని అన్యాయాల గురించి తెలియజేసింది యాంకర్ ఝాన్సీ.. ఒక వెబ్సైట్ వాళ్లు యాంకర్ ఝాన్సీ ని ఫలానా వారితో ఎఫైర్ ఉందని ..పోలీసు రైడ్ లో దొరికిపోయింది అంటూ ఒక రూమర్ను సృష్టించారు.కానీ ఇందులో నిజానిజాలు తెలుసుకోకుండా ఇలా అబాండాలు వేస్తే వ్యక్తిగతంగా మేము ఎంత భాధ అనుభవిస్తామో వారికి తెలియదంటూ తెలియజేస్తోంది ఝాన్సీ.


ఇలాంటి సంఘటన వల్ల ఒక పదవిని కోల్పోయాను అంటూ తెలియజేసింది .నేను యూనిసెఫ్ కోసం పనిచేశాను.. బాల్యవివాహాల పట్ల అవగాహన కల్పించే ఎన్నో కార్యక్రమాలను కూడా చేశాను.. దీనికి గుర్తింపుగా యూనిసెఫ్ కర్ణాటక అండ్ సౌత్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించే సమయంలో కొంతమంది ప్రతినిధులు ఇలాంటి వార్తలు రాయడం వల్ల వారు ఆ నిర్ణయాన్ని వారు వెనక్కి తీసుకున్నారని తెలిపింది ఝాన్సీ. ఇలాంటి రూమర్లు వల్ల తనకు రావలసిన పదవి కూడా రాకుండా పోయిందట.యాంకర్ ఝాన్సీ కెరియర్ విషయానికి వస్తే సినిమాలలో కంటే ఇమే కామెడీ పాత్రలలోని ఎక్కువగా నటిస్తూ ఉంటుంది. ఝాన్సీ యాంకర్ గా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న తర్వాతే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: