ఏమో అనుకున్నాం కానీ.. రౌడీ హీరో సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్నాడు?

praveen
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమకు హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. స్టార్ హీరోగా ఎదిగాడు అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలు చేసిన విజయ్ దేవరకొండ.. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా అవతారం ఎత్తాడు. ఇక ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన అతనికి ఊహించిన రీతిలో గుర్తింపు రాలేదు. కానీ ఒకసారి గా అర్జున్ రెడ్డి సినిమాలో నటించి ఇండస్ట్రీని షేక్ చేశాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి తర్వాత తెలుగు ప్రేక్షకులందరికీ విజయ్ దేవరకొండ రౌడీ హీరోగా మారిపోయాడు అని చెప్పాలి.

 ఇక ఆ తర్వాత గీతగోవిందం అనే సినిమాలో నటించి బ్లాక్బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అంతే కాదు ఇప్పటికీ ఎంతో మంది హీరోలకు టాలీవుడ్లో సాధ్యం కానీ 100 కోట్ల వసూళ్ల రికార్డును గీత గోవిందం తో కొట్టేశాడు. అయితే ఆ తర్వాత పలు సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఎందుకో విజయ్ దేవరకొండకు మాత్రం సరైన హిట్ లభించడం లేదు. మొన్నటికి మొన్న లైగర్ అనే పాన్ ఇండియా మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇక ఆ సినిమా కూడా డిజాస్టర్ గానే నిలిచింది అన్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండకు అర్జున్ రెడ్డి గీతగోవిందం లాంటి ఒక సినిమా పడితే బాగుండు అని అభిమానులు కోరుకుంటున్నారు.

 లైగర్ రిజల్ట్ తో సంబంధం లేకుండా ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఒక సాలిడ్ లైన్ అప్ సెట్ చేసుకున్నాడు అన్నది తెలుస్తుంది. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో సమంతతో కలిసి రొమాన్స్ చేస్తున్నాడు. సెప్టెంబర్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఇక జెర్సీ ఫ్రేమ్ గౌతమ్ తిన్ననూరితో విడి12 వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో శ్రీ లీల  హీరోయిన్గా నటిస్తోంది. ఇక మరో టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ కి కూడా ఓకే చెప్పేసాడట విజయ్. ఇక మరోవైపు గీతగోవిందం కాంబినేషన్ రిపీట్ అయ్యేలా పరశురాంతో మరో సినిమా చేస్తున్నాడు. ఇలా ఒక సాలిడ్ లైన్ ఆఫ్ సెట్ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: