ఆ డైరెక్టర్ గురించి మాట్లాడటం టైమ్ వేస్ట్.. చైతూ షాకింగ్ కామెంట్స్..?

Anilkumar
అక్కినేని హీరో నాగచైతన్య గత ఏడాది 'థాంక్యూ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఫ్లాప్ అందుకుంది. ఇక తాజాగా 'కస్టడీ' అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో చైతు సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. భారీ అంచనాల నడుమ మే 12వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. యాక్షన్ ఎంటర్టైల్డ్ గా రాబోతున్న ఈ సినిమాలో నాగచైతన్య ఒక కానిస్టేబుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ భారీ రెస్పాన్స్ ని అందుకుంది.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలోనే తాజా ఇంటర్వ్యూలో చైతు కస్టడీ మూవీ తో పాటు డైరెక్టర్ పరుశురామ్ తో తలెత్తిన వివాదంపై స్పందించాడు. తాజా ప్రెస్ మీట్ లో పరశురామ్ తో ఉన్న సమస్యలపై స్పందించమని రిపోర్టర్ కోరగా.. అందుకు చేతు బదిలిస్తూ.. పరుశురాం గురించి మాట్లాడటం టైం వేస్ట్. అతను నా టైమ్ అంత వేస్ట్ చేశాడు. ఈ టాపిక్ మాట్లాడటం కూడా నాకు ఇష్టం లేదు' అని నాగచైతన్య తేల్చి చెప్పాడు. అయితే పరశురాం పేరు ఎత్తగానే చైతు కాస్త అసహనం వ్యక్తం చేస్తూనే అతని గురించి మాట్లాడి టైం వేస్ట్ అంటూ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

గీత గోవిందం లాంటి సక్సెస్ఫుల్ మూవీ తర్వాత పరశురాం నాగచైతన్యతో 'నాగేశ్వరరావు' అనే సినిమా చేయాలనుకున్నాడు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్తుందని ఫ్యాన్స్ అందరూ అనుకున్నారు. కానీ అనుకోని కారణాలతో ఆ ప్రాజెక్టు కాస్త క్యాన్సిల్ అయింది. అయితే ఆ ప్రాజెక్టు ఎందుకు క్యాన్సిల్ అయింది అనే విషయాన్ని ఇప్పటివరకు అటు చైతు గాని ఇటు పరుశురాం కానీ క్లారిటీ ఇవ్వలేదు. మొత్తం మీద పరశురాం పై తాజాగా చైతూ చేసిన ఈ కామెంట్స్ అయితే ఇప్పుడు సోషల్ మీడియా అంతటా హాట్ టాపిక్ గా మారుతున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: