చైతూ తో ఆ అనుభవం అద్భుతం అంటున్న కృతిశెట్టి..?

Anilkumar
టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిన కృతి శెట్టి గత కొంతకాలంగా వరుస ప్లాపులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ అమ్మడి ఆశలన్నీ నాగచైతన్య 'కస్టడీ' సినిమా పైనే ఉన్నాయి. కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ మే 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో చైతు సరసన కృతి శెట్టి హీరోయిన్గా నటించగా.. ప్రియమణి, అరవింద్ స్వామి, శరత్ బాబు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. 

ఇక రిలీజ్ టైం దగ్గర పడడంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా కస్టడీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి శెట్టి.. సినిమాకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. కస్టడీ షూటింగ్ అనుభవాలను అలాగే నాగచైతన్యతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ను కూడా ఈ సందర్భంగా షేర్ చేసుకుంది కృతి శెట్టి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో 'బంగార్రాజు' అనే సినిమా వచ్చింది. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోగా.. చైతు, కృతి శెట్టి కాంబోలో రాబోతున్న రెండవ సినిమా ఇది. ఈ క్రమంలోనే నాగచైతన్యతో రెండోసారి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఒక అద్భుతమైన అనుభవం అని..

అతనితో వర్క్ చేయడం ఎంతో కంఫర్ట్ గా ఉంటుందని తాజా ఇంటర్వ్యూలో కృతి శెట్టి పేర్కొంది. అలాగే కస్టడీ మూవీ స్టోరీ  యూనిక్ గా ఉంటుందని, కచ్చితంగా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందని తన ఆశాభావాన్ని వ్యక్తపరిచింది. దీంతో కృతి శెట్టి తాజా ఇంటర్వ్యూలో చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక కృతి శెట్టి నటించిన గత సినిమాలు ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. వరుసగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ గా నిలిచాయి. మరి ఈ సినిమాతో నైనా కృతి శెట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందేమో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: