ఆ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న రష్మీ..!?

Anilkumar
బుల్లితెర టాప్ యాంకర్లలో ఒకరిగా కొనసాగుతున్న రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఈమె బర్త్డే చాలా ఘనంగా జరుపుకుంది. బంధుమిత్రుల మధ్య చాలా గ్రాండ్ గా పార్టీ ఎంజాయ్ చేసుకుంది రష్మీ. వాటికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏప్రిల్ 27న యాంకర్ రష్మీ పుట్టినరోజు ఈ క్రమంలోనే ఒక లగ్జరీ హోటల్లో రష్మీ తన పుట్టినరోజును జరుపుకుంది. చాలా తక్కువ మంది తో రష్మీ తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంది.వాటికి సంబంధించిన కొన్ని ఫోటోలు రష్మి తన సోషల్ మీడియా లో షేర్ చేసింది. 

ఇకపోతే రష్మీ తన బర్త్డే ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ దానికి ఒక క్యాప్షన్ కూడా జోడించింది. అదేంటంటే నీతో ఉండే వాళ్ళు ఉంటారు. పోయేవాళ్ళు పోతారు. వయసు మరో ఏడాది పెరిగింది జీవితంలో మరింత ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాను. నా పుట్టినరోజు ప్రత్యేకంగా మరచిన ప్రతి ఒక్కరికి థాంక్స్ అభిమానులు కుటుంబ సభ్యులు, మిత్రులు, నా జీవితానికి మూడు ప్రధాన పిల్లర్స్ అంటూ ఆ ఫోటో కింద క్యాప్షన్ జోడించి షేర్ చేసింది రష్మి. దీంతో రశ్మి చేసిన ఈ పోస్ట్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మనతో ఉండేవాళ్ళు ఉంటారు పోయేవాళ్ళు పోతారు అని రష్మీ అనడం వెనక దాని ఆంతర్యం అందరూ ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ పోస్టును చూసిన వారందరూ 35 ఏళ్లు దాటిపోయాయి ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆమె పెళ్లిపై సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు రచ్చ జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇకపోతే రష్మీ మరియు సుధీర్ ఎప్పటినుండో ప్రేమలో ఉన్నట్లుగా కనిపిస్తారు. కానీ అది నిజమా అబద్దమా అన్నది మాత్రం ఎవరికీ తెలియదు. ఇక బుల్లితెరపై వీరిద్దరి రొమాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరిద్దరి మధ్య ఉన్న బంధం గురించి ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. దీంతో రష్మీ చేసిన వ్యాఖ్యలు దేని గురించి అని ఆరా తీస్తున్నారు నెటిజెన్లు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: