వెకేషన్ పేరుతో అలాంటి పనులు చేస్తున్న మహేష్ బాబు..!?

Anilkumar
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు మహేష్ బాబు. చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా మంచే గుర్తింపును సంపాదించుకున్నాడు. తనదైన స్టైల్ లో సేవ చేస్తూ స్టార్ హీరోగా తన సత్తా చాటాడు.అంతేకాదు అందగాడు అన్న పదానికి పర్ఫెక్ట్ నిర్వచనం గా మారాడు మహేష్ బాబు. ప్రస్తుతం వరుస సినిమాలో చేస్తూ బిజీగా ఉన్నా మహేష్ బాబు ఈమధ్య కాలంలో ఎక్కువగా వెకేషన్ కి వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు.ఇలా వెళ్లడానికి అసలు కారణం వేరే ఉందన్న వార్తలు సైతం వినబడుతున్నాయి. ఇకపోతే హిట్లు ఫ్లాప్ లు అన్న సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక అడ్వెంచర్ సినిమాలో నటించబోతున్నాడు. 

ఈ సినిమాతో పాటు మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ తో కూడా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హారిక హాసిని క్రియేషన్స్ ద్వారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రాధాకృష్ణ సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో శ్రీ లీలా పూజా హెగ్డే మహేష్ కు జోడిగా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే మహేష్ బాబు సినిమాలే కాకుండా కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తూ ఉంటాడన్న విషయం తెలిసిందే. వీటి ద్వారా వచ్చిన సంపాదనను మహేష్ బాబు వ్యాపార రంగంలో పెట్టుబడిగా పెడుతున్నాడట. ఇప్పటికే ఏ ఎం బి సినిమాస్ లో భాగస్వామిగా ఉండడంతోపాటు టెక్స్టైల్స్ బిజినెస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు మహేష్ బాబు.

వాటితోపాటు ఇటీవల నమ్రత పేరు మీద కూడా హోటల్స్ ప్రారంభించాడు. అంతేకాదు బిజినెస్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు కోట్లు ఖర్చుపెట్టి దుబాయ్ లో ఒక ఖరీదైన విడుదలను కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పనిలో కోసమే తాజాగా మహేష్ బాబు దుబాయ్ వేకిషన్ పేరుతో వెళ్ళాడు అన్న వార్తలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.వాటితో పాటు రియల్ ఎస్టేట్స్ లో కూడా పెట్టబడును పెట్టబోతున్నట్లుగా కూడా వార్తలు వినబడుతున్నాయి. వీటి కారణంగానే తరచూ మహేష్ బాబు వెకేషన్ ల పేరుతో విదేశాలకు వెళుతున్నాడని తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: