'ఆ హీరో మరణం నన్ను ఎంతగానో బాధించింది'.. వైరల్ అవుతున్న భూమిక కామెంట్స్..!!

Anilkumar
టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఒకప్పుడు అగ్రహీరోయిన్ గా వెలుగొందిన భూమిక చావ్లా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోల సరసన నటించి స్టార్ ఇమేజ్ ని కైవసం చేసుకుంది భూమిక. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ భాషల్లోనూ ఎంట్తో మంది అగ్ర హీరోలతో నటించింది. ఇక ఇటీవలే భూమిక తన సెకండ్ ఇన్నింగ్స్ ని కూడా ప్రారంభించింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి అగ్ర హీరోల సినిమాల్లో అక్క, వదిన వంటి పాత్రల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా భూమిక ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఈ క్రమంలోనే బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తనను ఎంతో బాధించిందని.. ఆ బాధ నుంచి బయటపడడానికి చాలా సమయం పట్టిందని తెలిపింది భూమిక. ఇక సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన ధోని సినిమాలో సుశాంత్ కి అక్క పాత్రలో భూమిక నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ సమయంలో వీరి మధ్య ఎంతో మంచి స్నేహం ఏర్పడింది. అయితే సుశాంత్ ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకుని మరణించడంతో భూమిక ఒక్కసారిగా షాక్ కి గురైనట్లు తెలిపింది. మొదట సుశాంత్ మరణం గురించి తాను అస్సలు నమ్మలేదని.. అయితే ఆ తర్వాత సుశాంత్ మరణించిన వార్త తెలియడంతో చాలా కాలం పాటు ఆ బాధ నుంచి అస్సలు బయటపడలేకపోయానని తెలిపింది.

ఇక సుశాంత్ మరణించిన సమయంలో తాను కోవిడ్ వల్ల ముంబైకి దూరంగా ఉండటంతో అతని చివరి చూపుకు కూడా నోచుకోలేదని ఎమోషనల్ అయింది భూమిక. ఇప్పటికీ సుశాంత్ మరణించాడు అంటే అసలు నమ్మలేకపోతున్నాను అంటూ' భూమిక చెప్పుకొచ్చింది. దీంతో ప్రస్తుతం భూమిక చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'కీసికా భాయ్ కీసికా జాన్' సినిమాలో భూమిక కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ తో పాటు తెలుగులోనూ అగ్ర హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: