మరోసారి ఆ స్టార్ హీరోతో నటించాలని ఉందంటున్న రకుల్ ప్రీత్ సింగ్..?

Anilkumar
టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో లో చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది రకుల్ ప్రీత్ సింగ్. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమాతో వెండితెరకు హీరోయిన్గా పరిచయమైన రకుల్.. మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ మూవీ సక్సెస్ అవడంతో తర్వాత వరుసగా బడా హీరోలతో నటించే అవకాశాలు దక్కించుకుంది. టాలీవుడ్లో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు అందరితో నటించింది ఈ ముద్దుగుమ్మ. అటు సీనియర్ హీరో కింగ్ నాగార్జున తో కూడా ఓ రేంజ్ లో రొమాన్స్ చేసింది. యువ హీరోలైనా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పంజా వైష్ణవ్ తేజ్ సరసన కూడా నటించింది. అయితే కొన్నాళ్లకు తెలుగులో ఈ అమ్మడికి అవకాశాలు తగ్గిపోయాయి. 

దాంతో బాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఇక హీరోయిన్గా అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ అక్కడ కూడా ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో సక్సెస్ దక్కలేదు. దాంతో ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ వైపే చూస్తోంది ఈ ముద్దుగుమ్మ. తెలుగుతోపాటు అటు తమిళంలో కూడా కొన్ని సినిమాలు చేసింది రకుల్ ప్రీత్ సింగ్.ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. ముఖ్యంగా తాను మళ్ళీ టాలీవుడ్ లో ఓ స్టార్ హీరోతో కలిసి నటించాలని ఉందని తెలిపింది. ఆ హీరో మరెవరో కాదు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. రకుల్ ప్రీత్ సింగ్ తాజా ఇంటర్వ్యూలో తాను మరోసారి అల్లు అర్జున్తో కలిసి నటించాలని ఉందంటూ పేర్కొంది.

 గతంలో అల్లు అర్జున్తో కలిసి రకుల్ ప్రీత్ సింగ్ 'సరైనోడు' అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే కదా. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమాలో బన్నీ రకుల్ మధ్య కెమిస్ట్రీ కూడా ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు మరోసారి బన్నీతో కలిసి సినిమా చేయాలని ఉందంటూ తన మనసులో కోరికను బయటపెట్టింది రకుల్ ప్రీత్ సింగ్. మరి బన్నీతో మరోసారి నటించాలనే రకుల్ కోరికను ఏ దర్శకుడు తీరుస్తాడు చూడాలి. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అన్నట్టు ఇటీవల రకుల్ బాలీవుడ్ లో నటించిన 'చత్రివాలి' మూవీ మంచి విజయాన్ని అందుకుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: