చైతు పై షాకింగ్ కామెంట్స్ చేసిన శోభిత ధూళిపాళ్ల..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అయితే నాగచైతన్య సమంతతో విడాకులు తీసుకున్న అనంతరం హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో క్లోజ్ గా ఉన్నట్లు రకరకాల వార్తలో వచ్చాయి. వాటితో పాటు లండన్ లో వారిద్దరూ కలిసి ఒక రెస్టారెంట్లో కలిసి ఉన్న ఫోటోలు కూడా గతంలో సోషల్ మీడియా వేదికగా లీకై ఎంతగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరికి సంబంధించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ ఇప్పటివరకు శోభిత కానీ నాగచైతన్య కానీ ఎవరు కూడా స్పందించలేదు.

 ఈ క్రమంలోనే ఆ ఫోటోలన్నీ కూడా అవాస్తవాలు అని వాటిలో ఎలాంటి నిజం లేదు అన్న ప్రచారాలు కూడా వచ్చాయి. కానీ తాజాగా ఇప్పుడు మాత్రం హైదరాబాదులో “పొన్నియన్ సెల్వన్ 2”  ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి శోభిత కూడా హాజరైంది.ఇక ఆ ఈవెంట్లో శోభిత అనేక విషయాలను చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే శోభిత తన ఆరోగ్యం బాగా లేకపోయినప్పటికీ ఈ కార్యక్రమానికి వచ్చినట్లుగా చెప్పుకొచ్చింది. ఈవెంట్ లో భాగంగా యాంకర్ ..ఈ సినిమాలో పనిచేసిన ఒక టెక్నీషియన్ అరుణ్ విరామన్ గురించి మాట్లాడాలని అడుగుతుంది.

 ఇక దీనికి సమాధానంగా శోభిత దొరికి దొరకనట్టు ఉంటాడు అని.. ఆయన ఒక మిస్టరీ చైతన్య లాగా అంటూ చెప్పకనే చెప్పేసింది శోభిత.దీంతో నాగచైతన్యతో శోభిత క్లోజ్ గా ఉన్నట్లు వస్తున్న వార్తలు నిజమే అని స్పష్టమవుతుంది. ఇక ఈ విషయాన్ని విన్న చాలామంది నెటిజన్స్ నిజంగానే నాగచైతన్య శోభిత మధ్య ఏదో ఉంది అన్న కామెంట్లను చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇక ఏప్రిల్ 28న “పొన్నియన్ సెల్వన్ 2” సినిమా విడుదల కానుంది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో విక్రమ్, ఐశ్వర్యరాయ్, కార్తీ, త్రిష, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాల మరికొందరు నటీనటులు నటిస్తున్నారు. కాగా ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: