'దళపతి68' నుండి అదిరిపోయే అప్డేట్..!!

Anilkumar
తమిళ అగ్ర హీరో ఇళయ దళపతి విజయ్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 'లియో' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. విజయ్ కెరియర్ లో ఇది 67వ సినిమా కావడం విశేషం. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఏడాది చివర్లోనే మూవీ రిలీజ్ ని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా అనంతరం తలపతి 68 మూవీ ఏ డైరెక్టర్ తో ఉండబోతుందని కోలీవుడ్లో సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఇలాంటి సమయంలో తలపతి 68 కు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటికి వచ్చింది. thalapathy68 ప్రాజెక్ట్ ని సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ నిర్మించబోతోంది. 

తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన ఈ సంస్థ ఇప్పుడు విజయ్ తో సినిమా తెరకెక్కించునుంది. అంతేకాదు సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారికి ఇది 100వ సినిమా కావడం విశేషం. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ మూవీకి దర్శకత్వం వహించబోతున్నారు. ఇందుకు సంబంధించి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. అయితే తాజాగా నటి మిషా ఘోషల్ దర్శకుడు అట్లీతో దిగిన ఓ సెల్ఫీ ని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..' ధన్యవాదాలు అట్లీ సార్ అంటూ #Thalapathy 68 అనే హ్యాష్ ట్యాగ్ ను జోడించింది. ఇక ఈ పోస్టుతో తలపతి 68లో మిషా ఘోషల్ కూడా నటించబోతుందని తెలిసిపోయింది.

అలాగే ఈ మూవీ ని అట్లీ డైరెక్ట్ చేయబోతున్నారనే విషయం కూడా బయటికి వచ్చింది. ఇక కోలీవుడ్లో అట్లీ - విజయ్ కాంబినేషన్ కి ఎలాంటి క్రేజ్ ఎంతో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరి కాంబినేషన్లో వచ్చిన తేరి, మెర్సల్, బిగిల్ సినిమాలు హ్యాట్రిక్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు నాలుగోసారి ఈ కాంబో రిపీట్ కాబోతోంది. దీంతో ఈ కాంబినేషన్ పై ఇప్పటినుంచే అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం విజయ్ లియో మూవీ షూటింగ్ పూర్తిచేసే పనిలోపడ్డాడు. మరికొన్ని నెలలోనే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అవుతుంది. అటు అట్లీ కుమార్ షారుక్ ఖాన్ తో 'జవాన్' సినిమా చేస్తున్నాడు.ఈ మూవీ షూటింగ్ కూడా లాస్ట్ స్టేజ్ లో ఉంది. ఇక ఈ సినిమాలు పూర్తయిన తర్వాతే అట్లీ డైరెక్షన్లో విజయ్ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇక త్వరలోనే సూపర్ గుడ్ ఫిలిమ్స్ నుంచి ఈ ప్రాజెక్టుకు సంబంధించి అఫీషియల్ ఆనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: