తల్లి కోరిక తీర్చడానికై ఆరాట పడుతున్న జాన్వీ కపూర్..!!
కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో జాన్వీ సరికొత్తగా కనిపించబోతోందనీ సమాచారం.ఇప్పటికే విడుదల అయిన ఫస్ట్ లుక్ పిక్స్లో జాన్వీ లుక్స్ తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ మూవీ సెట్స్ మీద ఉందట.. ఈ భామ ముంబై నుంచి వచ్చి షూటింగ్లో పాల్గొంటోందట . హైదరాబాద్లో తెగ సందడి చేస్తోంది.
సౌత్లో మొదటి సినిమా ఇంకా షూటింగ్ దశలో నే ఉంది. అయినా జాన్వీకి వరుసపెట్టి క్రేజీ ఆఫర్లు వస్తున్నాయట. ఉప్పెనతో తుఫాను సృష్టించిన డైరెక్టర్ బుచ్చిబాబు తన నెక్స్ట్ ప్రాజెక్టులో రామ్ చరణ్ కు జోడీగా ఈ అమ్మడిని హీరోయిన్గా ఎంపిక చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. జాన్వీ కూడా రామ్ చరణ్కు జోడీగా నటించేందుకు ఓకే చెప్పినట్లు కూడా సమాచారం. అంతే కాదు ఇదే మూవీలో మరో హీరోయిన్గా మృణాల్ను సెలక్ట్ చేశాడట దర్శకుడు బుచ్చిబాబు. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించనున్నాడు.
బాలీవుడ్ భామలు తెలుగు ఇండస్ట్రీకి రావడం అంత కొత్త విషయం ఏమి కాదు. కానీ జాన్వీ కపూర్ మాత్రం వెరీ స్పెషల్. ఎందుకంటే ఆమె దివంగత స్టార్ హీరోయిన్ అందాల తార శ్రీదేవి కూతురు. శ్రీదేవి తన సినీ కెరీర్లో తెలుగు, హిందీ భాషల్లో అనేక చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా మంచి పేరు సంపాదించుకుంది. ఆమె తెర ముందు కనిపిస్తే బాక్సాఫీసు బద్దలు అవ్వాల్సిందే మరి .. దుబాయ్లో ఓ ఫంక్షన్ కోసం వెళ్లి అక్కడే కన్నుమూసిన శ్రీదేవి ఆమె కూతుర్లకు బ్రతికుండగానే తెరపైన చూడాలనుకుందట.కానీ ఆ కల తీరకుండానే వెళ్లిపోయిందట.కానీ అమ్మ మాటను నిలబెట్టాలని ఆమె కూతుర్లు తెగ ఆరాట పడుతున్నారు. అందుకు తగ్గట్లుగానే జాన్వీ కపూర్ అందివస్తున్న క్రేజీ ఆఫర్లను వదులుకోవడం లేదట అటు హిందీలో తన వరకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూనే ఇటు సౌత్లో తనకున్న క్రేజ్ను అయితే ఆమె క్యాష్ చేసుకుంటోంది.