'భోళా శంకర్' తర్వాత సినిమాలకు బ్రేక్ తీసుకోనున్న మెగాస్టార్..?

Anilkumar
టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోలకు దీటుగా సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సక్సెస్ తో బోనీ కొట్టిన చిరు ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో 'బోలా శంకర్' అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా మే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే భోళాశంకర్ షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా తర్వాత చిరంజీవి కొన్ని నెలలపాటు సినిమాలకి బ్రేక్ తీసుకోబోతున్నాడట. దానికి ప్రత్యేక రీజన్ అంటూ ఏమీ లేదు. కాకపోతే భోళా శంకర్ తర్వాత చిరు ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ఓకే చేయకపోవడమే. నిజానికి కొంతమంది డైరెక్టర్లను ఇప్పటికే సెలెక్ట్ చేసుకున్నాడు చిరు. 

కానీ ఇప్పటివరకు మూవీ ఫైనల్ కాలేదు. ఇప్పటికే కొంతమంది డైరెక్టర్స్, రైటర్స్ చిరుకి కొన్ని కథలు వినిపించారు. కానీ వాటిలో మెగాస్టార్ ని మెస్మరైజ్ చేసే కథ ఒకటి లేదు. భోళా శంకర్ తర్వాత మెగాస్టార్ యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములతో సినిమా చేయాలి. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో దానయ్య ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేశారు. కానీ ఎందుకనో ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది. అయితే డివివి దానయ్య మెగాస్టార్ కోసం ఇప్పుడు మరో డైరెక్టర్ ని వెతుక్కునే పనిలో ఉన్నాడు. అయితే చిరు నెక్స్ట్ మూవీకి డైరెక్టర్ ఎవరో తెలియదు. కానీ నిర్మాత మాత్రం దానయ్యే.

ఒకవేళ ఈ లోపు మరో నిర్మాత మంచి కథతో పాటు డైరెక్టర్ని తీసుకొచ్చి మెగాస్టార్ ని అప్రోచ్ అయితే ఆయన అటువైపు వెళ్లే ఛాన్స్ ఉంది. సో ప్రస్తుతం ఉన్న సిచువేషన్ ప్రకారం మెగాస్టార్ నెక్స్ట్ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ తర్వాతే ఉండొచ్చు. బోలా శంకర్ రిలీజ్ తర్వాత కొన్ని నెలలు బ్రేక్ తీసుకొని ఆ తర్వాత మరో సినిమాను మెగాస్టార్ సర్టిఫికెట్ తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇక బోలా శంకర్ సినిమాలో మెగాస్టార్ కి జోడిగా తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. మరో హీరోయిన్ కీర్తి సురేష్ చిరుకి చెల్లెలుగా కనిపించనుంది. తమిళంలో అజిత్ నటించిన వేదాలం మూవీకి ఇది తెలుగు అఫీషియల్ రీమేక్. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: