మరో తమిళ హీరోని లైన్ లో పెట్టిన వంశీ పైడిపల్లి..!!

Anilkumar
టాలీవుడ్ లో టాలెంటెడ్ డైరెక్టర్గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వంశీ పైడిపల్లి ఇటీవల కోలీవుడ్ అగ్ర హీరో ఇలా దళపతి విజయ్తో 'వారసుడు' అనే సినిమా తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్న విషయం అందరికీ తెలిసిందే. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా రూపొందిన సినిమా తమిళం తో పాటు తెలుగులో కూడా భారీ కలెక్షన్స్ ని అందుకుంది. ఇక వారసుడు హిట్ తర్వాత వంశీ పైడిపల్లి ఎవరితో సినిమా చేస్తాడనే ఆసక్తి ఇప్పుడు ఇండస్ట్రీలో నెలకొంది. 

అయితే వంశి పైడిపల్లి ఈసారి కచ్చితంగా తెలుగు హీరోతోనే సినిమా చేస్తాడని అంతా అనుకున్నారు.కానీ మన తెలుగు స్టార్ హీరోలు ఏ మాత్రం ఖాళీగా లేకపోవడంతో వంశీ పైడిపల్లి ఇప్పుడు మరో తమిళ హీరోతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడట. వారసుడు సినిమాని నిర్మించిన దిల్ రాజు ఈ ప్రాజెక్టును కూడా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈసారి సూపర్ స్టార్ రజినీకాంత్ తో వంశీ పైడిపల్లి ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వంశీ రజినీకాంత్ కి కథ వినిపించగా.. అందుకు రజనీకాంత్ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలు పూర్తి చేశాకే వంశీ పైడిపల్లి తో రజినీకాంత్ సినిమా చేస్తాడని అంటున్నారు.

మరి రజనీకాంత్ కోసం వంశీ పైడిపల్లి మళ్లీ ఫ్యామిలీ డ్రామానే తెరకెక్కిస్తాడా? లేక డిఫరెంట్ జోనర్ ఏదైనా ట్రై చేస్తాడా? అనేది చూడాలి. ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్' అనే సినిమా చేస్తున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ కమెడియన్ సునీల్ ఓ విలన్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. వేసవి కానుకగా ఈ మూవీ విడుదల కానుంది.ఇక ఈ సినిమా అనంతరం ఓ అగ్ర దర్శకుడు తో రజనీకాంత్ సినిమా చేయాల్సి ఉంది. దీంతో వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: