ట్రైలర్: డిఫరెంట్ జోనర్లు అదరగొడుతున్న విరూపాక్ష ట్రైలర్..!!
ఇక తాజాగా ఎట్టకేలకు ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల కావడం జరిగింది. ఈ సినిమా ట్రైలర్ కు గెస్ట్ గా అల్లు అరవింద్, దిల్ రాజు రావడం జరిగింది. ఈ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే..2.5 నిమిషాల రన్ టైంలో వచ్చిన ఈ ట్రైలర్ రుద్రవరం అనే ఊరిలో వరస మరణాలు సంభవిస్తూ ఉంటాయి. అందుకు గల కారణాలు ఏంటి అనే విషయంపై కనుక్కోవడానికి హీరో సాయి ధరంతేజ్ ఆ ఊరికి వెళ్తారు.. ఆ ఊరిలోనే హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా నివసిస్తున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే కనిపిస్తోంది .అలా వీరి మధ్య ప్రేమ కూడా ఏర్పడుతుంది.. ఇక ఊరిలో ఏర్పడిన సమస్య కారణంగా సాయి ధరంతేజ్ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాడో ఈ ట్రైలర్లు చూపించడం జరుగుతోంది.
ఇందులో కీలకమైన పాత్రలో సునీల్, బ్రహ్మాజీ ,అజయ్ ముఖ్యమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఒక డిఫరెంట్ జోనర్లు పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయబోతున్న ఈ చిత్రం సాయి ధరమ్ కెరియర్ లో ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి మరి. వరుస సినిమాలతో సక్సెస్ మీద ఉన్న సంయుక్త మీనన్ ఈ సినిమాతో హ్యాట్రిక్ హీట్ కొడుతుందేమో చూడాలి మరి.