ఏంటీ.. మెగాస్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆ డైరెక్టర్ తోనా..?

Anilkumar
ఈ ఏడాది ఆరంభంలో వాల్తేరు వీరయ్య అనే సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో 'భోళా శంకర్' అనే సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తమిళంలో అజిత్ హీరోగా నటించిన వేదాళం అనే సినిమాకి ఇది తెలుగు అఫీషియల్ రీమేక్. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి జోడిగా మిల్కీ బ్యూటీ తమన్న హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మరో హీరోయిన్ కీర్తి సురేష్ ఈ సినిమాలో మెగాస్టార్ కి చెల్లెలుగా కనిపించనుంది. ప్రస్తుతం చిత్రీకరణ శర వేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. 

ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ డైరెక్టర్ తో ఉంటుంది అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే మెగాస్టార్ నెక్స్ట్ మూవీ ఎవరు ఊహించని డైరెక్టర్ తో ఉండబోతున్నట్లు ఓ వార్త తెరపైకి వచ్చింది. ఆ ఆ డైరెక్టర్ పేరే వశిష్ట. గత ఏడాది నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా 'బింబిసార' అనే సినిమాతో వెండితెరకు దర్శకుడిగా పరిచయమైన వశిష్ట.. మొదటి సినిమాతోనే బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ హిట్ అందుకున్నాడు. అయితే లేటెస్ట్ ఫిలిం నగర్ టాక్ ప్రకారం మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ ప్రాజెక్ట్ వశిష్ట తోనే ఉండబోతోందట. ఇప్పటికే వశిష్ట మెగాస్టార్ కి అదిరిపోయే కథ చెప్పి ఒప్పించాడట.

త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కబోతుందని, భారీ బడ్జెట్ తో టాలీవుడ్ లో ఉన్న ఓ అగ్ర నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్టును నిర్మించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇక ఈ వార్త కాస్త బయటికి రావడంతో ఫాన్స్ అయితే ఈ కాంబినేషన్ ఫిక్స్ అవ్వడంతో ఫుల్ ఖుషి అవుతున్నారు. బింబిసార తర్వాత వీరి కాంబినేషన్లో ప్రాజెక్ట్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టడం ఖాయం అంటూ చెబుతున్నారు. ఇక త్వరలోనే ఈ ప్రాజెక్టుపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నిజానికి భోళా శంకర్ తర్వాత భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుములతో ఓ సినిమా చేయాల్సింది. కానీ డైరెక్టర్ వెంకీ ఇప్పుడు నితిన్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: