తారక్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 'కేజీఎఫ్' ను తలదన్నేలా 'NTR30'..?

Anilkumar
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఇటీవలే లాంచనంగా ప్రారంభమైన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. తారక్ కూడా షూటింగ్లో జాయిన్ అయ్యారు. అయితే ఈ సినిమాకు సంబంధించి వస్తున్న అప్డేట్స్ సినిమాపై అంచనాలను తారస్థాయికి చేరుస్తున్నాయి. ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ 30 మూవీలో యాక్షన్స్ సన్నివేశాలు కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాలను తలదన్నేలా ఉంటాయని అంటున్నారు.

ఏకంగా హాలీవుడ్ యాక్షన్ స్టంట్ కొరియోగ్రాఫర్లు ఈ సినిమా కోసం భారీ రేంజ్ లో ఫైట్స్ ని కొరియోగ్రఫీ చేస్తున్నారట. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతోనే టాలీవుడ్ కి ఎంట్రీస్తోంది ఈ ముద్దుగుమ్మ.ఇక సినిమాలో ఎన్టీఆర్ జాన్వి కపూర్ మధ్య వచ్చే సన్నివేశాలు కూడా అదుర్స్ అనిపించేలా ఉంటాయట. ఎన్టీఆర్, జాన్వి కపూర్ కాంబినేషన్లో రూపొందుతున్న తొలి సినిమా ఇదే కావడంతో బాలీవుడ్ ఆడియన్స్ కూడా ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ గా బాలీవుడ్ అగ్ర నటుడు సైఫ్ అలీ ఖాన్ ని సంప్రదించగా.. ఆయన విలన్ పాత్రను రిజెక్ట్ చేసినట్లుగా చెబుతున్నారు. దీంతో కొరటాల శివ మరో విలన్ ని వెతికే పనిలో ఉన్నారట. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ బ్యానర్లపై కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతమందిస్తున్నారు. ఏప్రిల్ 5 2024 వేసవి కానుకగా ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారిక ప్రకటన చేశారు. రిలీజ్ డేట్ ని దృష్టిలో పెట్టుకుని మూవీ టీం బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఎన్టీఆర్ 30 మూవీ కి సంబంధించి లేటెస్ట్ షెడ్యూల్ గోవాలో జరగనున్నట్లు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: