రవితేజ బ్లాక్ బస్టర్ మూవీకి నేటితో 19 ఏళ్ళు..!

Pulgam Srinivas
మాస్ మహారాజ రవితేజ తన కెరీర్ లో ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అలా రవితేజ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ లలో వెంకీ మూవీ ఒకటి. ఈ మూవీ కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన టాలెంట్ ఉన్న దర్శకుల్లో ఒకరు అయినటువంటి శ్రీను వైట్ల దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో రవితేజ సరసన స్నేహ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ 26 మార్చ్ 2004 వ తేదీన మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది.

అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఈ మూవీ లో అద్భుతమైన కథ ఉండడం అందుకు తగిన యాక్షన్స్ సన్నివేశాలు ... సెంటిమెంట్ సన్నివేశాలు ... అద్భుతమైన కామెడీ ఉండడంతో ఈ మూవీ కి జనాలు బాగా కనెక్ట్ అయ్యారు. దానితో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది.

ముఖ్యంగా ఈ మూవీ లో రైల్లో రవితేజ ... బ్రహ్మానందం ... వేణు మాధవ్ మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ఈ మూవీ కే హైలైట్ గా నిలిచాయి. ఇప్పటికి కూడా ఈ సన్నివేశాలకు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తూ ఉంటుంది. ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం కూడా ఈ మూవీ విజయంలో అత్యంత కీలక పాత్రను పోషించింది. ఇది ఇలా ఉంటే ఆ రోజుల్లో బ్లాక్ బస్టర్ విజయం అందుకొని అదిరిపోయే కలెక్షన్ లను సాధించిన ఈ సినిమా విడుదల అయ్యి నేటితో 19 ఏళ్ళు అవుతుంది. ఈ మూవీ విడుదల అయ్యి ఇన్ని సంవత్సరాలు అయిన ప్రేక్షకుల నుండి ఈ మూవీ కి మంచి ఆదరణ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: