మీటర్ మూవీ నుండి రెండవ సాంగ్ విడుదల తేదీని ప్రకటించిన మూవీ యూనిట్..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరోల్లో ఒకరు అయినటు వంటి కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరస మూవీ లతో ప్రేక్షకులను పలకరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా పోయిన సంవత్సరం ఏకంగా మూడు మూవీ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో ఈ సంవత్సరం కూడా ఇప్పటికే ఒక మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సంవత్సరం వినరో భాగ్యము విష్ణు కథ మూవీ.తో ప్రేక్షకులను పలకరించిన ఈ యువ హీరో ఈ మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు.
 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మీటర్ అనే మూవీ లో ఈ యువ హీరో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి టీజర్ ను చిత్ర బృందం విడుదల చేయగా ... ఆ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. అలాగే ఈ మూవీ నుండి చిత్ర బంధం ఒక పాటను ఇప్పటికే విడుదల చేయగా ఆ పాటకు కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ నుండి రెండవ పాట విడుదలకు సంబంధించిన అప్డేట్ ను ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది.

ఈ మూవీ నుండి "ఓ బేబీ జారిపోమాకే" అనే లిరికల్ సాంగ్ ను మార్చి 21 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే రమేష్ కాడూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ కి సాయి కార్తీక్ సంగీతం అందించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: