అజిత్, విజయ్ సినిమాలను రిజెక్ట్ చేసిన సాయి పల్లవి.. కారణం అదేనా..?

Anilkumar
సౌత్ నాచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి తెలిసింది కదా. సినిమాలో తన పాత్ర నచ్చితేనే సినిమా చేస్తోంది. నచ్చకపోతే అది స్టార్ హీరో సినిమా అయినా వెంటనే రిజెక్ట్ చేస్తుంది. అలా సినిమాలు రిజెక్ట్ చేయడంలో సాయి పల్లవి తర్వాతే ఏ హీరోయిన్ అయినా. సినిమాలు లేకపోతే వైద్యం అయినా చేసుకుంటాను, కానీ ఇష్టం లేకుండా సినిమాలు చేయను అంటూ ఓపెన్ గానే చెప్పేస్తుంది సాయి పల్లవి. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా తన పాత్రకు ప్రాధాన్యత ఉండకపోతే ఇక అంతే. ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర హీరోల సినిమాలను సాయిపల్లవి రిజెక్ట్ చేసింది. పవన్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలో మొదట సాయిపల్లవికి నటించే అవకాశం వచ్చింది.

 కానీ ఈమె రిజెక్ట్ చేయడంతో నిత్యమీనన్ పవన్ సరసన నటించింది. అలాగే భోళాశంకర్ మూవీలో కూడా చిరంజీవి చెల్లెలి పాత్రకు సాయి పల్లవిని సంప్రదిస్తే.. ఆ ఆఫర్ కూడా సాయి పల్లవి నో చెప్పడంతో చిత్ర యూనిట్ కీర్తి సురేష్ ని తీసుకున్నారు. ఆఖరికి తన ఫేవరెట్ హీరో మహేష్ బాబు సరిలేరు నీకెవరు సినిమాలో కూడా ఛాన్స్ వచ్చినా రిజెక్ట్ చేసింది. అయితే ఈ ఏడాది సాయి పల్లవి ఏకంగా ఇద్దరు అగ్ర హీరోల సినిమాలను రిజెక్ట్ చేసిందట. అందులో అజిత్ నటించిన తెగింపు సినిమాకి సాయి పల్లవిని సంప్రదించగా.మ్ ఆమె నో చెప్పింది. హెచ్ వినోద్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మంజు వారియర్ పోషించిన పాత్ర కోసం ముందుగా సాయిపల్లవిని అనుకున్నారట.

కానీ ఆ పాత్రకు అంత ప్రాధాన్యత లేదని సాయి పల్లవి రిజెక్ట్ చేసిందట. ఇక ప్రస్తుతం ఇళయ దళపతి విజయ్ - లోకేష్ కనకరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న లియో మూవీలో కూడా మొదట హీరోయిన్ పాత్ర కోసం సాయి పల్లవిని సంప్రదించారట. కానీ సినిమాలో నిడివి తక్కువ, క్యారెక్టర్ కూడా అంతంత మాత్రమే ఉండడంతో రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే కోలీవుడ్లో ఎంతో స్టార్ డం ఉన్న విజయ్, అజిత్ లాంటి అగ్ర హీరోల సినిమాల్లో అవకాశం వచ్చిన సాయి పల్లవి రిజెక్ట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ప్రస్తుతం సాయి పల్లవి సినిమాలపరంగా ఎక్కువగా అవకాశాలు రావట్లేదు. అయినా కూడా ఈమె అగ్ర హీరోల సినిమాలను రిజెక్ట్ చేయడం గమనార్హంగా మారింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: