ప్రభాస్ అభిమానులను మోసపోయేలా చేసిన చిత్రం ఇదే..!!

Divya
పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన రాదే శ్యామ్ సినిమా అభిమానులను ఎంతటి నిరాశకు గురిచేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా గత ఏడాది మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా ప్రియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో హీరోయిన్గా పూజా హెగ్డే నటించింది.ఈ సినిమా విడుదలకు ముందే ఈ చిత్రం పైన భారీ అంచనాలు నెలకొన్న కానీ అభిమానులు అంచనాలను అందుకోలేకపోయింది ఈ సినిమా.
బాహుబలి సినిమా తర్వాత వచ్చిన సాహో సినిమా గోరంగా ఫ్లాప్ అయ్యింది. దీంతో అభిమానులు రాధే శ్యామ్ సినిమా పైన అంచనాలు పెట్టుకున్నారు కానీ ఈ చిత్రం అందరీ అంచనాలను ఒక్కసారిగా తలకిందులు చేసింది మొత్తం ఈ సినిమా ఐదు భాషలలో విడుదల అయింది. యువి క్రియేషన్ నిర్మించిన ఈ సినిమాని హిందీ వర్షన్ కు అమితాబచ్చన్ వాయిస్ ఓవర్ ఇవ్వగా తెలుగు వర్షన్ కు ఎస్ ఎస్ రాజమౌళి ఓవర్ ఇవ్వడం జరిగింది. స్టోరీ స్క్రీన్ ప్లే క్లారిటీ లోపించడంతో ఈ సినిమా థియేటర్లు ఘోరంగా ప్లాప్ అయ్యింది.
ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో నిర్మించారు. ఈ సినిమాతో యువీ వారికి గట్టిగానే దెబ్బ తగిలింది. ఏకంగా ఈ సినిమాతో రూ.80 కోట్ల మేరకు నష్టం మిగిలిందని వార్తలు కూడా వినిపించాయి. అయితే మొత్తంగా రెండేనా ఏళ్ల గ్యాప్ తర్వాత ప్రభాస్ ఈ సినిమాతో అభిమానుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా కోసం పూర్తిగా మార్చుకున్నారు.రొటీన్ ప్రేమ కథ చిత్రాలకు భిన్నంగా ఈ సినిమాని తెరకెక్కించారు ఈ సినిమా తెరకెక్కించిన సమయంలో కరోనా ప్రారంభమైంది. దాదాపుగా రెండేళ్లపాటు యూనిట్ ఎంతో కష్టాలను ఓర్చుకొని ఈ సినిమాను తెరకెక్కించి విడుదల చేయగా.. అంతా వృధా అయిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: