కెజిఎఫ్ 3 నుండి అదిరిపోయే అప్డేట్.. ఏంటో తెలుసా..!?

Anilkumar
భారత చిత్ర సినిమాలోని బిగ్గెస్ట్ యాక్షన్ ఫ్రాంచైజీ లలో కే జి ఎఫ్ సినిమా కూడా ఒకటి . ఫ్రాంచైజీ నుండి ఈ సినిమాకి సంబంధించిన మూడో పార్ట్ కూడా ఉంటుందని ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ రెండో భాగం క్లైమాక్స్ లోనే హిట్ కూడా ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. కానీ మూడో భాగం ఎప్పుడు ఉంటుంది అనే విషయంపై ఇప్పటివరకు క్లారిటీ అయితే రాలేదు. అయితే తాజాగా ఇప్పుడు ఆ మిస్టరీకి తెరపడింది అని చెప్పాలి. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ బయటకు రావడం జరిగింది. సలార్ ఎన్టీఆర్ 31 ప్రాజెక్టులు పూర్తయిన వెంటనే కేజిఎఫ్ త్రీ ని సెట్స్ మీదకు తీసుకెళ్లేలా ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 

అంతేకాదు వర్షలో భాగంగా ఈ మూడు సినిమాలకి లింక్ ఉంటుంది. అందుకే ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా ఎన్టీఆర్ 31 సినిమా పూర్తి చేసిన వెంటనే కూడా పెరకెక్కించాలని భావిస్తున్నాడు. ప్రశాంత్ నీ 2024 చివరి నాటికి ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లి 2025లో విడుదల చేయాలన్న సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్తో సలార్ ప్రాజెక్ట్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ దాదాపు తుదిదశకు చేరుకుంది. ఈ ఏడాదిలోని సెప్టెంబర్ 28వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లుగా కూడా అంటున్నారు. ఇక ఈ సినిమాలో పృధ్విరాజ్ కుమార్ అని ఒక కీలకపాత్రలో నటిస్తున్నారు.

ప్రభాస్ కి జోడిగా ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి సనన్ నటిస్తోంది.ఈ సినిమాని కూడా రెండు భాగాల్లో ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ నీళ్ళు సినిమా రిలీజ్ అయిన వెంటనే ఎన్టీఆర్ తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని మొదలుపెట్టే దిశగా పనిచేస్తున్నాడు. 2024 చివర్లోనే ఈ సినిమా విడుదల చేసేందుకు భారీ ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా వెంటనే కేజీఎఫ్ 3 ప్రాజెక్టు ప్రారంభించాలి. అందుకే ఎన్టీఆర్ సినిమాను చాలా తక్కువ సమయంలోనే పూర్తి చేయాలని భావిస్తున్నాడు ప్రశాంత్. అయితే ఈ ప్రాజెక్టులు నడుమ ప్రశాంత్ సలార్ 2  ఎప్పుడు తీస్తాడు అన్నది చూడాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: