పవన్ కళ్యాణ్ కొమరం పులి సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..!?

Anilkumar
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పవర్ఫుల్ సినిమా కొమరం పులి అందరికీ గుర్తుండే ఉంటుంది.ఎస్ జే  సూర్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. 2010లో భారీ అంచనాలతో  వచ్చిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమాలో పవర్ నటనకు మంచి మార్కులే పడ్డాయి .మ్యూజిక్ కూడా బావుంది కానీ ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. అలాగే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడిగా నికిషా పటేల్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాలో తన గ్లామర్ తో అందరినీ ఆకట్టుకుంది.

 ఈ సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించిన ఈమె అనంతరం టాలీవుడ్కు గుడ్ బై చెప్పింది. తన అందం అభినయంతో ఎందరినో ఆకట్టుకున్నప్పటికీ సినిమాల్లో మాత్రం ఎక్కువ కాలం రాణించలేకపోయింది ఈమె. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన ఓం త్రి సినిమాలో కనిపించింది ఈమె. ఆ సినిమా అనంతరం అరకు రోడ్డులో గుంటూరు రోడ్డులో కనిపించి సందడి చేసింది. ఆ తర్వాత తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు నికిషా తెలుగులోనే కాకుండా ఈమె తమిళ కన్నడ భాషల్లో కూడా పలు సినిమాల్లో నటించింది.

ఇక అలా ఒకప్పుడు స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించిన ఈమె ప్రస్తుతం ఎక్కడ కనిపించడం లేదు. దీంతో నిఖీషా ఇప్పుడు ఎలా ఉంది ఏం చేస్తుంది అని అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఈమెకి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి .సినిమాలకు దూరమైనప్పటికీ ఈమె సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది .రోజు తనకి సంబంధించిన రకరకాల ఫోటోలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది ఈమె. ఈ క్రమంలోనే తాజాగా తనకి సంబంధించిన ఇప్పటి ఫోటోలు చూసిన అందరూ ఆశ్చర్యపోతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: