"ప్రాజెక్ట్ కే" షూటింగ్ అంత శాతం పూర్తి..!

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పెట్టి పాన్ ఇండియా మూవీ లలో అంతకుమించిన మూవీ లలో నటిస్తూ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ప్రభాస్ ప్రస్తుతం ప్రాజెక్టు కె అనే పాన్ వరల్డ్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూ వీకి టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... దీపికా పదుకొనే ఈ మూవీ లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అమితా బచ్చన్ దిశా పటాని ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో కనిపించనుండగా ఈ మూవీ కి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయనన్ సంగీతం అందించనున్నాడు.

ఈ విషయాన్ని కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ ప్రొడ్యూసర్ అయినటు వంటి అశ్విని దత్ అధికారికంగా ప్రకటించాడు. ప్రస్తుతం ఈ సంగీత దర్శకుడు తెలుగు లో దసరా అనే మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే దసరా సినిమా నుండి విడుదల చేసిన పాటకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఈ మూవీ ఆల్బమ్ పై కూడా ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సంగీత దర్శకుడు ఎన్నో తమిళ సినిమాలకు సంగీతం అందించి తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన ఒక అప్డేట్ బయటకు వచ్చింది.

చాలా రోజుల క్రితం ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా భాగం పూర్తయింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఈ మూవీ షూటింగ్ 70% వరకు కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లోనే మిగతా షూటింగ్ ను కూడా పూర్తి చేసే విధంగా ఈ మూవీ యూనిట్ పక్కా ప్లానింగ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నిలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: