సాయి ధరమ్ తేజ్ కథతో శర్వానంద్ బ్లాక్ బాస్టర్ హిట్..!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన శర్వానంద్ ఇప్పటికే ఎన్నో మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. అలా శర్వానంద్ కెరియర్ లో మంచి విజయం అందుకున్న సినిమాలలో శతమానం భవతి సినిమా ఒకటి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమా ద్వారా శర్వానంద్ కు మంచి గుర్తింపు మరియు అద్భుతమైన విజయం బాక్స్ ఆఫీస్ దగ్గర లభించాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కథను మొదటగా టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటువంటి సాయి ధరమ్ తేజ్ కు ఈ మూవీ యూనిట్ వినిపించిందట. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ లో సాయి ధరమ్ తేజ్ నటించలేక పోయినట్లు ... దానితో ఇదే కథను శర్వానంద్ వినిపించగా శర్వానంద్ ఈ మూవీ లో నటించడానికి ఒకే చెప్పడంతో ఈ మూవీ ని శర్వానంతో చేసినట్లు తెలుస్తోంది. ఇలా సాయి ధరమ్ తేజ్ కోసం తయారు చేసిన కథతో శర్వానంద్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తుంది.