శ్రీ రెడ్డి మౌనానికి కారణం....!!

murali krishna
టాలీవుడ్ ఇండస్ట్రీ లో కొంతమంది సినీ ప్రముఖులకి  ఒకానొక టైం లో కంటి మీద కునుకు లేకుండా చేసిన శ్రీ రెడ్డి అందరికి తెల్సిందే.ఐతే ఆమె మాట్లాడే పద్దతి గూర్చి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె గత కొన్నాళ్లుగా తమిళనాడులో ఉంటుంది. ఐతే అక్కడ నుండే ఆమె తన ఆపరేషన్స్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగిస్తూ ఉంటుంది.
ఆమె చెన్నై వెళ్లి పోయిన తర్వాత కూడా శ్రీ రెడ్డి అనేక సార్లు తెలుగు హీరోల మీద మరియు తెలుగు చిత్ర  పరిశ్రమ మీద సంచలన వ్యాఖ్యలు చేస్తూ విమర్శించిన విషయం తెల్సిందే. ఆమె ను చాలా మంది సోషల్ మీడియా ద్వారా ఫాలో అవుతున్నారు. చాలా మంది ఆమెను అభిమానిస్తారు. అందుకు కారణం ఆమె సినిమా హీరోలను మరియు రాజకీయ పార్టీ లను తీవ్రంగా విమర్శిస్తూ ఉంటుంది. అలా పవన్ యాంటీ ఫ్యాన్స్ తో పాటు మరి కొందరు హీరోల యాంటీ ఫ్యాన్స్ కూడా ఆమెకు ఫ్యాన్స్ గా మారారు. ఇప్పుడు వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ రెడ్డి చాలా సైలెంట్ గా ఉండటం ను వారు తట్టుకోలేక పోతున్నారు.
ఆమె ఇన్నాళ్లు మౌనంగా ఎందుకు ఉంటుంది అంటూ చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేస్తున్నారు. అదుగో ఇదుగో అంటూ శ్రీ రెడ్డి యొక్క సైలెన్స్ ను చాలా మంది బ్రేక్ చేయించేందుకు ట్రై చేసిన కూడా ఆమె మాత్రం ప్రస్తుతానికి తన నోటికి తాళం వేసుకుని ఉందా అన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి శ్రీ రెడ్డి యొక్క సైలెన్స్ కు కారణం ఏంటీ అనేది తెలీదు ముందు ముందు అయినా ఈమె తన నోరు విప్పి గతంలో మాదిరిగా తన వ్యూ ను సోషల్ మీడియా ద్వారా మరియు యూట్యూబ్ ద్వారా అందరికి వినిపిస్తుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: