"గీత గోవిందం" మూవీకి మొదట హీరోయిన్ ఆప్షన్ ఎవరో తెలుసా..?

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీలో ఒకరితో అనుకున్న సినిమా మరొకరితో తీయడం అనేది చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అలాంటి వాటిలో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజాయలను అందుకుంటే ... మరికొన్ని సినిమాలు మాత్రం అదిరిపోయే రేంజ్ విజయాలను అందుకుంటుంటాయి. అలాగే కొంత మంది నటి మనులు రిజెక్ట్ చేసిన సినిమాలు కూడా అదిరిపోయే రేంజ్ సక్సెస్ ను అందుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాగే ఒక భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సినిమాను తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న రాసి కన్నా మిస్ చేసుకుంది.

ఆ సినిమా ఏదో ప్రస్తుతం తెలుసుకుందాం. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న రష్మిక మందన టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఛలో మూవీతో ఎంట్రీ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఆ మూవీ తర్వాత పరుశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన గీత గోవిందం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో రష్మిక మందన కు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ లభించింది. ఇది ఇలా ఉంటే మొదటగా ఈ మూవీ లో రష్మిక మందన పాత్రకు ఈ సినిమా దర్శకుడు రాశి ఖన్నా ను అనుకున్నారట.

అలాగే రాసి కన్నా ను ఈ పాత్ర కోసం సంప్రదించగా ఈ ముద్దుగుమ్మ ఆ సమయంలో పలు మూవీ లతో ఫుల్ బిజీగా ఉండడం వల్ల ఈ మూవీ ని రిజెక్ట్ చేసినట్లు ... దానితో ఆ ఆఫర్ రష్మిక కు వెళ్ళినట్లు ... ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాను ఓకే చేయడంతో రష్మిక కు అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ లభించినట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ద్వారా విజయ్ దేవరకొండ కు  పరుశురామ్ కూడా సూపర్ క్రేజ్ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: