'ఆదిపురుష్' సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసిన ఎడిటర్..?

Anilkumar
పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో 'ఆది పురుష్' సినిమా ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కింది. భారీ విజువల్స్, గ్రాఫిక్స్ తో సుమారు 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో టి సిరిస్ సంస్థ ఈ సినిమాని నిర్మించగా.. ప్రభాస్ సరసన కృతి సనన్ హీరోయిన్ గా కనిపించనుంది.ఈ సినిమాలో ప్రభాస్ మొట్టమొదటిసారి శ్రీరాముడి పాత్రలో నటిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నాడు. లక్ష్మణుడి పాత్రను సన్నీ సింగ్ పోషిస్తున్నాడు. 

ఇక ఇటీవల విడుదలైన ఆదిపురుష్ టీజర్ పై ఆడియన్స్ లో భారీ నెగిటివిటీ ఏర్పడిన సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఈ టీజర్ ని భారీగా  ట్రోల్స్ చేశారు. అయితే తాజాగా ఆది పురుష్ మూవీ పై ఎడిటర్ ఆశిష్ మాత్రమే స్పందించారు.' 90 సెకండ్ల టీజర్ తో సినిమా మొత్తాన్ని జడ్జ్ చేయడం ఏమాత్రం సరికాదు. ఇప్పటికే ఆది పురుష్ సినిమాపై వచ్చిన నెగిటివ్ ట్రోల్స్ ని పరిగణలోకి తీసుకొని సినిమాలో చిన్న చిన్న మార్పులు చేయడం జరిగింది. పెద్దగా మార్పులు అయితే ఏమీ చేయలేదు. ఈ సినిమాపై డైరెక్టర్ ఓం రౌత్ ఎంతో క్లారిటీగా ఉన్నారు. మొదటి నుండి సినిమాని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నామో ఇప్పుడు కూడా అలానే సినిమాపై వర్క్ చేస్తున్నాం.

ఇక సినిమాలో ప్రభాస్, కృతి సనన్ ఆన్ స్క్రీన్ ప్రజెన్స్ ఎంతో అమేజింగ్ గా ఉంటుంది. ఈ సినిమాను థియేటర్స్ లో ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత కచ్చితంగా ఆడియన్స్ అభిప్రాయం మారుతుంది. వాళ్ళందరూ గర్వపడేలా ఈ సినిమా ఉంటుంది' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆది పురుష్ ఎడిటర్ ఆశిష్ మాత్రే సినిమా గురించి చెప్పిన విధానాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఈసారి ఆది పురుష్ బిగ్ స్క్రీన్ పై అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నట్లు స్పష్టం అవుతుంది. ఇక ఈ సినిమా జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా తెలుగుతోపాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్, రాజా డీలక్స్ వంటి వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాల్లో సలార్ ఇదే ఏడాది సెప్టెంబర్ నెలలో విడుదల కాబోతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: