చిన్నారుల పాలిట దైవంలా మారిన మహేష్ బాబు...!!

murali krishna
మహేష్ బాబు తన సంపదలో  పసిబిడ్డల ప్రాణం కోసం కొంత మొత్తం దానం చేస్తున్నారు. మహేష్ రెండు గ్రామాలను కూడా దత్తత తీసుకున్నారు. ఏపీ మరియు తెలంగాణాలలో ఉన్న ఈ రెండు గ్రామాలకు అనేక సదుపాయాలు కూడా సమకూర్చారు. ఆ గ్రామాల ప్రజల ఇబ్బందులు ను తొలగించారు. అలాగే చాలా కాలంగా మహేష్ చిన్న పిల్లలకు ఉచిత వైద్యం ను అందిస్తున్నారు
ఎంబీ ఫౌండేషన్ స్థాపించి వందల మంది చిన్నారుల ప్రాణాలను ఆయన కాపాడారు. హృదయ సంబంధిత సమస్యల బారిన పడిన పేద చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయిస్తున్నారు. తాజాగా ఒక్క ఫోన్ కాల్ తో చిన్నారి ప్రాణం కాపాడారు మహేష్. నిర్మాత నాగవంశీకి ఒకరు ఫోన్ చేసి పేద చిన్నారి హృదయ రోగంతో బాధపడుతున్నట్లు ఆయన చెప్పారు. ఆ చిన్నారి వివరాలు నిర్మాత నాగవంశీ మహేష్ వైఫ్ నమ్రతకు తెలియజేశారట . ఎంబీ ఫౌండేషన్ తరపున చిన్నారికి రెండు వారాల్లో చికిత్స అందేలా మహేష్ చేశారని సమాచారం. ఆపరేషన్ చేయడంతో ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తుంది.
ఈ విషయం తెలిసిన నెటిజెన్స్ అలాగే మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా హీరో గ్రేట్ అంటూ తెగ పొగిడేస్తున్నారు.. ఒక ప్రక్క మహేష్ తండ్రి కృష్ణ ఆసుపత్రిలో విషమ స్థితిలో ఉన్నా కూడా విజయవాడలో ఒక బాలుడికి గుండె ఆపరేషన్ జరిగే ఏర్పాట్లు ఫౌండేషన్ తరపున చేశారట.చిన్నారులను కాపాడాలనే మహేష్ నిర్ణయం వెనుక కొడుకు గౌతమ్ కూడా ఉన్నాడు. గౌతమ్ ఏడు నెలలకే పుట్టాడని అసలు దక్కుతాడో లేదో అన్న పరిస్థితిలో ఖరీదైన వైద్యంతో గౌతమ్ ని బ్రతికించుకున్నారట.
మనకు డబ్బులున్నాయి కాబట్టి గౌతమ్ ను కాపాడుకున్నాం, మరి పేదల పరిస్థితి ఏంటని మహేష్ కి అప్పుడు ఆలోచన వచ్చిందట. అప్పుడు ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేద చిన్నారులకు సహాయం చేస్తున్నట్లు మహేష్ చెప్పుకొచ్చారుఈ విషయాలను బాలయ్య అన్ స్టాపబుల్ షోలో కూడా మహేష్ బయటపెట్టారు. ఇక మహేష్ త్రివిక్రమ్ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ కి సిద్ధం అవుతున్నారని తెలుస్తుంది.. పదికోట్ల రూపాయల ఖర్చుతో భారీ ఇంటి సెట్ ను వేశారు. అక్కడే కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: