ఖుషి: నిరాశలో ఉన్న అభిమానులకి గుడ్ న్యూస్?

Purushottham Vinay
రీసెంట్ గా విజయ్ దేవరకొండ 'లైగర్ ' సినిమా చేసి భారీ ప్లాప్ ని మూటగట్టుకున్నాడు.విజయ్ దేవరకొండ ఇంకా సమంత జంటగా నటిస్తున్న సినిమా 'ఖుషి'. ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ అయ్యింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమాని హోల్డ్ లో పెట్టారు. దాంతో ఫ్యాన్స్ బాగా నిరాశచెందారు.అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం 'ఖుషీ' కొత్త షెడ్యూల్ పిక్సై నట్లు సమాచారం తెలుస్తోంది. ఈనెల 27 వ తేదీ నుంచి నుంచి విజయ్ సెట్స్ కు హాజరుకానున్నారు. వారం రోజుల పాటు ఆయనపై ఏకధాటిగా షూటింగ్ ఉంటుందని సమాచారం తెలుస్తుంది. అటుపై మార్చి 8 వ తేదీ నుంచి సమంత రంగంలోకి దిగుతుందని సమాచారం తెలుస్తుంది. దాదాపు నెల రోజుల పాటు హైదరాబాద్ లోనే ఈ షెడ్యూల్ జరుగుతుందని సమాచారం తెలిసింది. ఇందులో ప్రధానంగా విజయ్-సమంతపై కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారని సమాచారం తెలుస్తోంది.


ఇద్దరిపై ఇప్పటికే కశ్మీర్ అందాల్లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించిన విషయం తెలిసిందే. తాజా సన్నివేశాలు వాటికి కంటున్యూటీ ఉంటుందని సమాచారం తెలుస్తుంది. ఇంకా ఈ షెడ్యూల్ తరువాత కేరళలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుందట. అలెప్పీ అందాల్లో హీరో-హీరోయిన్ల మధ్య కొన్ని రొమాంటిక్ సీన్స్ షూట్ చేయనున్నారట. ఇక సమంత కూడా అలెప్పీ బ్యూటీ అన్న సంగతి తెలిసిందే.ఆ రకంగా ఈ షెడ్యూల్ సమంతకి స్పెషల్ గా ఉండే అవకాశం ఉంది.మొత్తానికి ఖుషి సినిమాని స్టార్ట్ చేసి అభిమానులని ఖుషి చేశారు విజయ్, సమంత. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ ఇక ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. అలాగే ప్రస్తుతం సమంత రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తోన్న 'సీటాడెల్' వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత తొలిసారి వెబ్ సిరీస్ షూట్ కే ఆమె హాజరైంది.మరి ఈ వెబ్ సిరీస్ తో సమంత మళ్ళీ హిట్ కొడుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: