బాబాయ్ - అబ్బాయ్ సినిమాలు వాయిదా పడ్డట్టేనా..?

Divya
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తారకరత్న మరణం ఒక్క వారి కుటుంబాన్నే కాదు యావత్ దేశ సినీ పరిశ్రమను దుఃఖానికి గురిచేసింది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే నూరు సంవత్సరాల బంగారు భవిష్యత్తు ఉన్న తారకరత్న కేవలం 40 సంవత్సరాలు కూడా నిండకుండానే మరణించడంతో ప్రతి ఒక్కరు మరింత ఎమోషనల్ అవుతున్నారు. తారకరత్న మరణం మరొకవైపు బాధను కలిగిస్తుంటే ఆయన మరణాన్ని చూసి తట్టుకోలేక ఆయన పిల్లలు తారకరత్న భౌతిక దేహం వద్ద గుండెలవిసేలా ఏడుస్తుండడం చూస్తే ఎంతటి వారి మనసు అయినా తరుక్కుపోతుంది.
అంతలా ఒక విషాదగాథ సినీ ఇండస్ట్రీలో చవి చూశామని చెప్పవచ్చు.  ఇదిలా  ఉండగా తారకరత్న మరణించడంతో అటు ఎన్టీఆర్ తన 30వ సినిమాను ఇటు బాలకృష్ణ తన 108వ సినిమా షూటింగ్లను కొంతకాలం పోస్ట్ పోన్ చేసినట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ తన 108వ సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలయ్యింది.  కానీ తారకరత్నకు గుండెపోటు వచ్చిందని తెలిసిన రోజు నుంచి ప్రతి చిన్న విషయాన్ని కూడా బాలకృష్ణ దగ్గరుండి మరీ చూశారు.  అలా 23 రోజులపాటు తన పనులను పక్కనపెట్టి తారకరత్న ఆరోగ్యం కోసమే పాటుపడ్డారు . కానీ తారకరత్న మరణించడం జరిగింది. దీంతో మరింత కుమిలి పోయిన బాలకృష్ణ ప్రస్తుతం తన సినిమా షూటింగ్ ను వాయిదా వేసినట్లు సమాచారం.
మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.  ఇక సోదరుడు తారకరత్న మరణించడంతో ఎన్టీఆర్ కూడా తన సినిమా షూటింగ్లను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.  ఇక తారకరత్నకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యే వరకు వీరిద్దరూ తమ సినిమా షూటింగ్లను ప్రారంభించబోము అని స్పష్టం చేసినట్లు సమాచారం. ఎన్టీఆర్ కుటుంబంలో ఇలాంటి విషాదఛాయలు అలుముకోవడం అభిమానులను కలవరపెడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: