SSMB28: పక్కా ప్యాన్ ఆడియన్స్ సినిమా అట?

Purushottham Vinay
టాలీవుడ్ లో ప్రస్తుతం వరుస హిట్లతో నెంబర్ 1 హీరోగా దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్  దర్శకత్వంలో తన 28 వ సినిమా చేస్తున్నారు మహేష్.ప్రస్తుతం ఈ మూవీ వర్కింగ్ టైటిల్‌గా 'ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 28' (SSMB 28)అని వ్యవహరిస్తున్నారు. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై చిన బాబు ఇంకా అలాగే సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర సంగతులను నాగవంశీ ప్రేక్షకులతో పంచుకొని ఈ చిత్రంపై అంచనాలను అమాంతం పెంచేశారు.''మా సినిమా 'ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 28' ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొందుతుంది. అంతే కాదు ఈ మూవీ అభిమానులకు కూడా విపరీతంగా నచ్చేస్తుంది. వారిని అసలు ఏ మాత్రం నిరాశ పరచదు. ప్రతి ఏరియాలో కూడా రాజమౌళి రికార్డులకు దగ్గరగా మా చిత్రం వస్తుంది. మేం నిర్మించిన 'అల వైకుంఠపురంలో'  మూవీ అప్పట్లో రాజమౌళి మూవీ వసూళ్లకు దగ్గరగా వచ్చింది.

ఇక సినిమా స్క్రిఫ్ట్‌పై మాకు పూర్తి నమ్మకముంది.ఇక ఆ అంచనాలను ఖచ్చితంగా ఈ సినిమా చేరుకుంటుందని ఆశిస్తున్నా'అని నాగవంశీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన 'సార్' అనే సినిమాని నిర్మించారు. ఈ సినిమా ఇక ఫిబ్రవరి 17 వ తేదీన విడుదల కానుంది. 'సార్' మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటూ నాగవంశీ ఈ కామెంట్స్ చేశారు.'ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 28' లో పూజా హెగ్డే ఇంకా శ్రీ లీల  హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో జగపతిబాబు విలన్ పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11 వ తేదీ న విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. అందులో భాగంగా శరవేగంగా ఈ సినిమా షూటింగ్ ని చేస్తున్నారు. అలాగే ఈ సినిమా కోసం రూ.10కోట్లతో రెండు భారీ హౌస్ సెట్స్ వేస్తున్నారు. ఇక ఈ సెట్స్‌లో షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది.ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మహేష్ కోసం అదిరిపోయే పాటలను, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని రెడీ చేస్తున్నాడు థమన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: