అనందంలో ప్రభాస్ ఫ్యాన్స్.. షాక్ లో యష్ ఫ్యాన్స్..?

Purushottham Vinay
ప్రశాంత్ నీల్ తో ఆ సినిమా చిత్ర నిర్మాత కిరంగదూర్ సమావేశం కానున్నారని సమాచారం తెలుస్తుంది. ఇక తాజా సమాచారాన్ని బట్టి 'సలార్ -2' సినిమా ఉంటుందని టాక్. ఇది దర్శకుడి నిర్ణయంపైనే ఆధార పడి ఉందని తెలుస్తోంది.'సలార్' తరువాత ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నారు. ఆ తరువాత రామ్ చరణ్...యశ్ లాంటి హీరోలు కూడా ప్రశాంత్ కోసం క్యూలో ఉన్నారు. ఇప్పటికే వాళ్లతో కమిట్ మెంట్లు కూడా ఉన్నాయి. వాళ్లతో సినిమాలు పూర్తి చేసే వరకూ బయటకు వచ్చే అవకాశం లేదని వార్తలు వచ్చాయి.అయితే తాజాగా అందిన అప్డేట్ ప్రకారం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా తరువాత సలార్ 2 సినిమా ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. kgf 3 కూడా ఉంటుంది కానీ.. ఇప్పుడే ఉండదు. దానికి ఇంకా చాలా టైం పడుతుందని సమాచారం తెలుస్తుంది.ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్ చివరి దశలో వుంది.


ఈ సినిమా అయిపోగానే నీల్ ఎన్టీఆర్ 31 సినిమా స్టార్ట్ చెయ్యనున్నాడు.KGF సిరీస్ తో దేశావ్యాప్తంగా కన్నడ సినిమా ఇండస్ట్రీ స్టామినాని నిరూపించిన నీల్ సలార్ ని ఎలా తెరకెక్కిస్తాడో అని ఫ్యాన్స్ ఎదురు చూపులు చూస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా కాంబినేషన్ పై తారా స్థాయిలో అంచనాలు వున్నాయి.అయితే సలార్ 2 ఉంటుందనే విషయం ప్రభాస్ అభిమానులకి ఊరట కలిగించినా kgf 2 చాలా ఆలస్యం అవుతుందనే విషయం మాత్రం యష్ ఫ్యాన్స్ ని అసహనానికి గురి చేసింది.KGF 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 1225 కోట్ల వసూళ్లు సాధించింది. బాలీవుడ్ లో అయితే ఎన్నో రికార్డులు బద్ధలు కొట్టింది. విడుదల అయిన ప్రతి భాషలో కూడా 100 కోట్ల పైగా షేర్ రాబట్టింది. ఇక సలార్, ఎన్టీఆర్ 30 సినిమాలు కూడా ఆ స్థాయిలో వసూళ్లు రాబడతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.మరి చూడాలి ఆ సినిమాతో ఇంకెన్ని పాన్ ఇండియా రికార్డులు క్రియేట్ అవుతాయో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: