అన్ని రోజులపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి షేర్ కలెక్షన్లను వసూలు చేసిన వాల్తేరు వీరయ్య..!

Pulgam Srinivas
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి తాజాగా వాల్తేరు వీరయ్య అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా , బాబి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ నిర్మించిన ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. మాస్ మహారాజా రవితేజ కీలకమైన పాత్రలో నటించిన ఈ మూవీ లో బాబీ సింహ , ప్రకాష్ రాజ్ ఇతర ముఖ్య పాత్రలలో నటించారు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ జనవరి 12 వ తేదీన విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలక్షన్ లను వసూలు చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈ సినిమా ఏకంగా 12 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి షేర్ కంటే ఎక్కువ కలెక్షన్ లను వసూలు చేసింది. మొదటి రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 22.90 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేయగా ,  2 వ రోజు 11.95 కోట్లు ,  3 వ రోజు 12.61 కోట్లు , 4 వ  రోజు 11.42 కోట్లు ,  5 వ రోజు 8.80 కోట్లు ,  6 వ రోజు 7.33 కోట్లు , 7 వ రోజు 4.85 కోట్లు ,  8 వ రోజు 3.85 కోట్లు , 9 వ రోజు 4.66 కోట్లు ,  10 వ రోజు 6.66 కోట్లు , 11 వ రోజు 1.90 కోట్లు ,  12 వ రోజు 1.20 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

13 వ రోజు ఈ సినిమా 69 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. ఇలా వాల్తేరు వీరయ్య సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 12 రోజుల పాటు ఒక కోటి షేర్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను వసూలు చేసి అద్భుతమైన కలక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టింది. ప్రస్తుతం కూడా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు లభిస్తున్నాయి. మొత్తం మీద ఈ సినిమా 13 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 98.32 కోట్ల షేర్ , 160.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: