గేమ్ చేంజర్: అమ్మాయి కోసం సందీప్ కిషన్ మారణహోమం ?

VAMSI
యంగ్ హీరో సందీప్ కిషన్ ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమే అయింది. సందీప్ కిషన్ మొదటి సినిమా ప్రస్థానం లో అడుతంగా నటించి మంచి పేరును తెచ్చుకున్నాడు. ఆ తర్వాత దాదాపుగా ఇరవైకి పైగా సినిమాలు చేసినా ఇతని ఖాతాలో సాలిడ్ గా చెప్పుకోవడానికి ఒక హిట్ కూడా లేదు. ఒకటో రెండో సినిమాలు యావరేజ్ ఫలితాన్ని మాత్రమే అందించాయి. అయినా ఏ మాత్రం పట్టు వదలకుండా కొత్త కొత్త కథలను ఎంపిక చేసుకుంటూ అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. తాజాగా సందీప్ నుండి మరో విభిన్న కథాంశంతో వస్తున్న చిత్రం "మైఖేల్". కాగా ఈ సినిమా తన కెరీర్ లో తొలి పాన్ ఇండియా సినిమా కానుండడం మరో విశేషం.
ఈ సినిమా ట్రైలర్ ను ఇవ్వాల తెలుగు ట్రైలర్ ను బాలయ్య , తమిళ ట్రైలర్ ను అనిరుద్ లు విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం యాక్షన్ ను పూర్తిగా నింపేశారని చెప్పాలి. ఇక ట్రైలర్ ను చూసిన వారికి అర్ధమయ్యే విషయం ఒకటే.. తాను ప్రేమించిన అమ్మాయి కోసం సందీప్ చేసిన మారణకాండ. గతమూ పురాణాల్లో చెప్పుకున్న విధంగా ఆడవాళ్ళ కోసం యుద్దాలు జరిగాయి అని తెలిసిందే. అయితే ఎందుకు అమ్మాయి కోసం ఇలా చేయాల్సి వచ్చిందన్న విషయం మాత్రం థియేటర్ లోనే తెలుసుకోవలసి వస్తుంది. చిత్ర బృందం సమాచారం ప్రకారం ఈ సినిమాను ఫిబ్రవరి 3 న రిలీజ్ చేస్తున్నారు.
ఇందులో సందీప్ కిషన్ కు సరసన దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్, వరుణ్ సందేశ్, విజయ్ సేతుపతి, అనసూయ భరద్వాజ్ మరియు వరలక్ష్మి శరత్ కుమార్ లు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను రంజిత్ జైకోడి చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమా హిట్ కావడం సందీప్ కిషన్ కు చాలా అవసరం. టోటల్ సినిమా యూనిట్ కూడా సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందన్న నమ్మకంతోనే ఉన్నారు. మరి ఎటువంటి ఫలితం వస్తుందో తెలియాలంటే మరో పది రోజుల వరకు వెయిట్ చేయాల్సిందే.    


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: