పవర్ స్టార్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్...!!

murali krishna
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నాడు.. ఈయన మొన్నటి వరకు కూడా రాజకీయాల్లో బిజీగా ఉండగా సినిమాలను అయితే పక్కన పెట్టాడు.. ఇక ఇప్పుడు మళ్ళీ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడని తెలుస్తుంది ..ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా చేస్తూనే తర్వాత సినిమాల లైనప్ ను సెట్ చేసుకుంటున్నారటా పవన్.. మరి ఈ లైనప్ లో పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబో కూడా ఉందని .వీరి కాంబోలో 'భవదీయుడు భగత్ సింగ్' సినిమా రావాల్సి ఉంది.. ఈ సినిమాను గత రెండేళ్ల క్రితం ప్రకటించిన ఇంకా సెట్స్ మీదకు మాత్రం వెళ్ళలేదు.. అయితే ఇదే సినిమాను ఇప్పుడు టైటిల్ మార్చి 'ఉస్తాద్ భగత్ సింగ్' గా ప్రకటించిన సంగతి తెలిసిందే.. అఫిషియల్ గా ఈ సినిమా నుండి అనౌన్స్ మెంట్ వచ్చిన తర్వాత పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎక్కువ ఉత్సాహంగా ఉన్నారటా ..అయితే ఈ సినిమా గురించి తాజాగా ఆర్ట్ డైరెక్టర్ పవన్ కళ్యాణ్ స్నేహితుడు ఆనంద్ సాయి ఇంట్రెస్టింగ్ విషయాన్నీ పోస్ట్ చేసారు.. ఈ సినిమా రీమేక్ సినిమా అని ఈయన క్లారిటీ కూడా ఇచ్చేసాడు.. ఈ సినిమా తేరీ సినిమాకు రీమేక్ అని ఎప్పటి నుండో వార్తలు వస్తూనే ఉన్నాయటా... కానీ మేకర్స్ మాత్రం అధికారికంగా అయితే ప్రకటించలేదు. ఇక ఇప్పుడు ఆనంద్ సాయి కూడా రీమేక్ అని చెప్పారు కానీ ఆ రీమేక్ సినిమా పేరు మాత్రం అస్సలు రివీల్ చేయలేదు.. ఇక ఇది రీమేక్ సినిమా అని తెలియడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం కొద్దిగా డిజప్పాయింట్ అవుతున్నారు. ఎందుకంటే రీమేక్ అంటే ఆల్రెడీ అంతా చూసి ఉంటారు కాబట్టి పెద్దగా ఆసక్తి అయితే ఉండదు.. అయితే హరీష్ శంకర్ మీద ఉన్న నమ్మకం ఉండడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా హిట్ అవుతుంది అని ఎంతో ధీమాగా ఉన్నారు.. ఎందుకంటే ఇంతకు ముందు దబాంగ్ రీమేక్ నే గబ్బర్ సింగ్ గా తీసి సూపర్ హిట్ ను కూడా అందుకున్నాడు..దీంతో ఈ రీమేక్ ను కూడా చాలా మార్పులు చేసి హరీష్ శంకర్ కొత్తగా తెరకెక్కిస్తారు అని అనుకుంటున్నారట ఫ్యాన్స్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: