బలయ్య ముందే కంటతడి పెట్టుకున్న వీరసింహరెడ్డి డైరెక్టర్..!?

Anilkumar
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాప్ అవబల్ సీజన్ 2 ఎవరు ఊహించని విధంగా భారీ రెస్పాన్స్ ను దక్కించుకుంది. ప్రభాస్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలు సైతం రావడం జరిగింది. ఇక ప్రభాస్ వచ్చిన ఎపిసోడ్ ని ఇప్పటికి రెండు భాగాలుగా విడుదల చేశారు ఆ హ టీం. త్వరలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ని కూడా విడుదల చేయనున్నారు. అయితే ఈ సంక్రాంతి కానుకగా ఒక స్పెషల్ ఎపిసోడ్ ని ప్లాన్ చేశారు ఆ టీం. ఇందులో భాగంగానే బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా టీం ఈ షోలో సందడి చేయనున్నారు .

ఈ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేయడం జరిగింది. ఇక ఈ ఎపిసోడ్ లో భాగంగా ఈ సినిమా దర్శకుడు గోపీచంద్ మరియు ఈ సినిమాలో కీలకపాత్రలో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్,హాని  రోజ్ ఇలా తదితరులు ఈ షోలో బాలయ్యతో పాటు సుందరి చేశారు. అంతేకాకుండా ఈ ప్రోమోలో భాగంగా బాలకృష్ణ మాస్ మహారాజ రవితేజ తో కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. బాలకృష్ణ రవితేజ తో మాట్లాడుతూ 100 కోట్ల హీరోకి కంగ్రాట్స్ అని ఆటపట్టించడంతో ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అనంతరం రవితేజ బాలయ్యకి థాంక్స్ తమ్ముడు అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ నవ్వుతారు.

ఇందులో భాగంగానే బాలకృష్ణ గోపీచంద్ ఒక ప్రశ్న అడుగుతాడు.. అదేంటంటే క్రాక్ సినిమా రాకముందు రెండు సంవత్సరాల పాటు కెరియర్ పరంగా చాలా ఇబ్బందులు పడ్డావు అని విన్నాను.. అలాంటి పరిస్థితుల్లో ఆస్తులను కూడా అమ్మేసినట్టు నాకు తెలిసింది.. ఇక అలాంటి సమయంలో మీ మానసిక స్థితి ఎలా ఉంది అంటూ గోపీచంద్ అడిగాడు బాలకృష్ణ... ఇక ఆ ప్రశ్నకు చాలా ఎమోషనల్ అయ్యాడు గోపీచంద్ చాలా ఎమోషనల్ గా బాలయ్య ప్రశ్నకి సమాధానం చెప్పాడు.. ఇక బాలయ్య ప్రశ్నకి గోపీచంద్ ఎలాంటి సమాధానాన్ని చెప్తాడో తెలియాలి అంటే ఈ ఎపిసోడ్ విడుదల అయ్యేంతవరకు వచ్చి చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: